Breaking News Live Telugu Updates: అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ - సీతారామరాజు వారసులకు సత్కారం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 04 Jul 2022 12:26 PM
Modi Speech in Bhimavaram: ఇక్కడికి రావడం నా అదృష్టం, ఈ మట్టికి నా నమస్కారాలు - మోదీ

అల్లూరి విగ్రహావిష్కరణ వేదికపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలుగువీర లేవరా అన్న శ్రీశ్రీ పాటను గుర్తు చేశారు. అల్లూరి స్వాతంత్య్ర  సంగ్రామంతో యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. సీతారామరాజు పుట్టిన ఈ నేలపై కలుసుకోవటం ఎంతో అదృష్టమని అన్నారు. స్వాతంత్య్ర సమరంలో ఆంధ్రదేశ ప్రజలు చేసిన ఆత్మబలిదానాలు, ఆదివాసీ ప్రజలు చూపిన తెగువ ఎంతో ప్రేరణనిచ్చిందని అన్నారు. ఇంత గొప్పచోటుకు రావటం తన అదృష్టమని మోదీ చెప్పారు. ఈ మట్టికి నమస్కరిస్తున్నానని అన్నారు.

రంగా కొడుకుగా పుట్టడం తన అదృష్టం.. రంగా 75వ జయంతి వేడుకల్లో వంగవీటి రాధా

విజయవాడలో ఘనంగా వంగవీటి మోహనరంగా 75వ జయంతి వేడుకలు నిర్వహించారు. రంగా కొడుకుగా పుట్టడం తన అదృష్టం అని, రంగా ఒక వ్యక్తి కాదు... ఒక శక్తి అన్నారు వంగవీటి రాధా.  విజయవాడలో రంగా తనయుడు వంగవీటి రాధా వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పేదల పెన్నిది వంగవీటి రంగా అని, ఆయన విజయవాడకు మాత్రమే చెందిన వ్యక్తి కాదు అని.. ఆయన అభిమానులు అన్నిపార్టీల్లో ఉన్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రంగా అభిమానులు జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. తన తండ్రి రంగా ఆశయాలను కొనసాగిస్తానన్నారు. బడుగు, బలహీన వర్గాలకు వెన్నంటి ఉండి, వారి సమస్యలపై పోరాడిన వ్యక్తి రంగా అని వంగవీటి రాధా పేర్కొన్నారు.

Alluri Sitaramaraju Statue Unveiling: అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

భీమవరంలోని ఏఎస్ఆర్ నగర్ లో అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అల్లూరి వారసులను ఘనంగా సత్కరించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు సోదరుడి కుమారుడైన 80 ఏళ్ల శ్రీరామరాజు అనే వ్యక్తికి పాదభివందనం కూడా మోదీ చేశారు.

Alluri Sitaramaraju Statue Unveiling: అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

భీమవరంలోని ఏఎస్ఆర్ నగర్ లో అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అల్లూరి వారసులను ఘనంగా సత్కరించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు సోదరుడి కుమారుడైన 80 ఏళ్ల శ్రీరామరాజు అనే వ్యక్తికి పాదభివందనం కూడా మోదీ చేశారు.

CM Jagan Speech: అందుకే అల్లూరి జిల్లా ఏర్పాటు చేసుకున్నాం - సీఎం జగన్

స్వాతంత్ర్యం కోసం, దేశం, అడవి బిడ్డల కోసం చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు చిరకాలం నిలిచిపోతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ‘‘ఆయన నడిచిన నేల అయినందున మన్యం ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు జిల్లా అని కూడా పేరు పెట్టుకున్నాం. 125వ జయంతి సందర్భంగా అల్లూరి జిల్లాలో కూడా ఓ కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరుగుతోంది.’’ అని సీఎం జగన్ అన్నారు.

PM Modi In Bhimavaram: అల్లూరి విగ్రహావిష్కరణ సభలో ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ భీమవరంలోని ఏఎస్ఆర్ నగర్‌లో అల్లూరి విగ్రహ ఆవిష్కరణ సభ వద్దకు చేరుకున్నారు. వేదికపై అందరికీ అభివాదం చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీకి విల్లు, బాణం ధరింపజేశారు. వేదికపై ప్రధాని మోదీతో పాటు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్ సహా సినీ నటుడు చిరంజీవి తదితరులు ఉన్నారు. 

Nara Lokesh: అల్లూరి విగ్రహావిష్కరణ సంతోషం - నారా లోకేశ్

‘‘అమాయక గిరిజనం నిరంకుశ పాలకుల చేతుల్లో నలిగిపోతుంటే వారిలో ధైర్యం నింపి నిప్పు కణాల్లా మార్చిన ఉత్తేజం అల్లూరి సీతారామరాజు. స్వాతంత్య్ర పోరులో ధృవతారలా మెరిసి బ్రిటిష్‌వారి గుండెల్లో దడపుట్టించిన మన్యంవీరుడు అల్లూరిని ఆజాది కా అమృత మహోత్సవ్ లో భాగంగా స్మరించుకోవడం మనకు గర్వకారణం. అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని చేతుల మీదుగా అల్లూరి విగ్రహావిష్కరణ జరగడం ఒక తెలుగువాడిగా సంతోషంగా ఉంది. అల్లూరి జయంతి సందర్భంగా ఆ విప్లవజ్యోతి సాహస చరిత్రను స్మరించుకుని స్ఫూర్తిని పొందుదాం.’’ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.





PM Modi Tour in Telangana: ముగిసిన ప్రధాని తెలంగాణ పర్యటన, ఏపీకి పయనం

తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన ముగిసింది. కాసేపటి క్రితమే రాజ్‌ భవన్ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు మోదీ బయలుదేరి వెళ్లారు. బేగంపేట నుంచి గన్నవరం ఎయిర్‌ పోర్టుకు మోదీ వెళ్లనున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో మోదీకి గవర్నర్ తమిళిసై, ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీడ్కోలు పలికారు.

PM Tour in Bhimavaram: ప్రధాని మోదీ భీమవరం పర్యటన వేళ అధికారుల్లో హైటెన్షన్

  • ప్రధాని మోదీ భీమవరం పర్యటన నేపథ్యంలో అధికారుల్లో హైటెన్షన్

  • హెలికాఫ్టర్ లో వెళ్లడానికి వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గాన వెళ్లే అవకాశం

  • ఇప్పటికే రెండు సార్లు వాహన శ్రేణితో  ట్రయల్ రన్

  • హనుమాన్ జంక్షన్ బైపాస్ లో వంతెన దెబ్బతిన్న మార్గంలోనే తిరిగి గన్నవరం విమానాశ్రయానికి రావాల్సి ఉండటం, మరమ్మత్తులు పూర్తి కాకపోవడంతో  ఆందోళన

  • ప్రధాని వాహనశ్రేణి వెళ్లడానికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతున్న అధికారులు

Guntur News: గుంటూరు రైల్వే స్టేషన్‌లో ప్రజా సంఘాల ఆందోళన

  • గుంటూరు రైల్వే స్టేషన్‌లో ప్రజా సంఘాల ఆందోళన

  • రఘురామకృష్ణంరాజు గో బ్యాక్ అంటూ ఆందోళన చేసిన ప్రజా సంఘాలు

  • రాష్ట్రంలో అశాంతి నెలకొల్పడానికి కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు గో బ్యాక్ అంటూ ఆందోళన

  • కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే రఘురామకృష్ణంరాజు గోబ్యాక్ అంటూ నినాదాలు

  • పేద ప్రజల అభివృద్ధిని సంక్షేమాన్ని రఘురామకృష్ణరాజు ఒక పథకం ప్రకారం అడ్డుకున్నారంటూ ఆరోపిస్తూ ఆందోళన చేసిన ప్రజా సంఘాలు

Vanasthalipuram: వనస్థలిపురం వద్ద తగలబడిన ఆయిల్ ట్యాంకర్

  • వనస్థలిపురం ఆటో నగర్ డీర్ పార్క్ వద్ద తగలబడుతున్న కెమికల్  ట్యాంకర్

  • చౌటుప్పల్ వైపు నుండి ఆటో నగర్ వైపు వస్తున్న కెమికల్ ట్యాంకర్లలో  ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు

  • ఫైర్ సిబ్బందికి సమాచారం అందించిన స్థానికులు

  • ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది

Chiranjeevi: అల్లూరి విగ్రహావిష్కరణకు హాజరు అవుతున్న చిరంజీవి

అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు సినీ నటుడు చిరంజీవి కూడా హాజరవుతున్నారు. ఇందుకోసం ఆయన నిన్న రాత్రే రాజమహేంద్రవరానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కాసేపటి క్రితం రోడ్డు మార్గం ద్వారా భీమవరానికి బయలుదేరారు.

Alluri Seetharamaraju: అల్లూరి విగ్రహావిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి

పశ్చిమ గోదావరి జిల్లాలో అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ఉత్సవాల ప్రారంభ వేడుకకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. భీమవరానికి సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో జరిగే భారీ బహిరంగసభలో పాల్గొని ప్రధాని ప్రసంగిస్తారు.

Background

పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అదే సమయంలో నైరుతి బంగాళాఖాతం నుంచి సైతం 50 కిలోమీటర్ల వేగంతో తీరంలో బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.  నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం హైదరాబాద్ సహా ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. నేడు (జూలై 4) ఉత్తర ఒడిశా దాని పరసర ప్రాంతాల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఏపీలోని కోస్తాంధ్రలో నేడు ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుల హెచ్చరిక, వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేడు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ ఇప్పుడు పశ్చిమ పసిఫిక్ కి వెళుతోంది. దాంతో జూలై రెండు, మూడు వారాల్లో రెండు నుంచి మూడు అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. అందులో ఏదైన ఒక్కటి ఉత్తరాంధ్ర తీరం వైపుగా వచ్చే అవకాశాలున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాస - టెక్కళి, అనకాపల్లి, విశాఖ​, పార్వతీపురం జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఒకట్రెండు చోట్ల భారీ వర్షం పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని జిల్లాల్లో నేటికి వర్షాలు మొదలుకాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు ఎప్పుడు మొదలుపెట్టాలో అర్థం కాని పరిస్థితి ఆ జిల్లాల రైతుల్లో నెలకొంది.


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి జల్లులు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణా జిల్లా గుడివాడ - కైకలూరు మీదుగా కొనసాగుతున్న వర్షాలు నేరుగా పశ్చిమ గోదావరి, నర్సాపురం నుంచి కృష్ణా జిల్లా బందరు, పెడన దాక విస్తరించనున్నాయి. కృష్ణా, విజయవాడ​, గుంటూరు, బాపట్ల, ఉత్తర ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. అయితే జిల్లాల్లో కొన్ని చోట్ల మాత్రమే భారీ వర్షం కురుస్తుండగా, మిగతా ప్రాంతాల్లో చినుకులు కూడా పడవు.


హెచ్చరిక: కొన్ని వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అన్నదాతలను హెచ్చరించింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.


తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో నేడు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని పంజాగుట్ట, బంజారాహిల్స్, ఖైరతాబాద్, మణికొండ​, లింగంపల్లి, జూబ్లీ హిల్స్ తో పలు ప్రాంతాల్లో రాత్రి వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.