Breaking News Live Telugu Updates: శ్రీనివాసుడి సేవలో కాజల్ అగర్వాల్, భర్తతో కలిసి తొలిసారి తిరుమలకు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
Background
నైరుతీ రుతుపవనాలు చవరి దశకు వచ్చేశాయి. దీంతో నేడు అక్కడక్కడ వర్షాలు పడ్డా, సెప్టెంబర్ 27 నుంచి వర్షాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పుంజుకోనున్నాయి. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ...More
ఆదిలాబాద్ జిల్లాల్లో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ సబితా ఇంద్రారెడ్డి, ఐకే రెడ్డి పర్యటించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రులను టీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రానికి వచ్చారు. ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. స్థానిక మావల జాతీయ రహదారి నుంచి జిల్లా కేంద్రం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జై కేటీఆర్. జై టిఆర్ఎస్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఐలమ్మ విగ్రహానికి రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లు నివాళులర్పించారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కు ఈ సందర్భంగా రజక సంఘం సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు.