Breaking News Live Telugu Updates: ప్రధానిపై దాడికి పీఎఫ్ఐ కుట్ర, ఆ పార్టీని నాశనం చేయాల్సిందే: బీజేపీ

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 25 Sep 2022 01:46 PM

Background

తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం, పశ్చిమ రాజస్థాన్ నుంచి వాయువ్య మధ్యప్రదేశ్, ఉత్తర ఒడిశా, ఉత్తర...More

Rajendra Nagar: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పర్యటించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

చేవెళ్ల పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని బండ్లగూడ జాగిర్ నార్సింగి శంషాబాద్ ప్రాంతాలలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పర్యటించారు. పండిత్ దీన్ దయాల్ జయంతిని పురస్కరించుకొని మణికొండ, నార్సింగ్ లో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు, మణికొండలో బీజేపీ నేత వినోద్ ఇంట్లో అల్పాహారం స్వీకరించి, బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బేగం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు.