Breaking News Live Telugu Updates: నిరుద్యోగ ర్యాలీనీ జయప్రదం చేయండి టీపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
Background
ఈ రోజు ద్రోణి / గాలిలోని అనిచ్చితి సెంట్రల్ మధ్యప్రదేశ్ లోని ఆవర్తనం నుండి ఇంటీరియర్ మహారాష్ట్ర, ఇంటీరియర్ కర్ణాటక మీదగా ఇంటీరియర్ తమిళనాడు & పరిసర ప్రాంతాల్లోని ఆవర్తనం వరకు సగటు సముద్ర మట్టంకి 0.9 కి మీ ఎత్తు...More
నిరుద్యోగ ర్యాలీనీ జయప్రదం చేయండి
టీ- పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్
ఈనెల 26న అదిలాబాద్ జిల్లా కేంద్రంలో టీ-పీసీసీ రాష్ట్ర అద్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్వర్యంలో తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీని విజయవంతం చేయాలని టీ-పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ పిలుపు నిచ్చారు. మంగళవారం ఉట్నూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు. రాష్ట్రంలో బీఅర్ఎస్ ప్రభుత్వం నిరోద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు. నీళ్ళు, నిధులు, నియమాల కోసం కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో నిరోద్యోగులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. నిరుద్యోగులకు బరోసా కల్పించడానికి అండగా నిలవడానికి టీ-పీసీసీ రాష్ట్ర అద్యక్షులు రేవంత్ రెడ్డి వస్తున్నారని తెలిపారు. కావున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుండీ కాంగ్రెస్ నాయకులు, రైతులు, విద్యార్థినిలు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు,పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీ-పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేడ్మ బొజ్జు పటేల్, మైనార్టీ రాష్ట్ర నాయకులు జావేద్ ఆక్రమ్, మండల అధ్యక్షులు దూట రాజేశ్వర్, ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు కనక తూల్సిరం, మైనార్టీ మండల అధ్యక్షులు షేక్ సలీం, మైనార్టీ పట్టణ అధ్యక్షులు ఇమ్రాన్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు బానోత్ జైవంత్ రావు, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు అచ్ఛ దేవానందం, సీనియర్ నాయకులు ఖయ్యూంఖాన్, సయ్యద్ నిసార్, రాజగౌడ్, బొడ్డు తిరుపతి, మోబిన్, తదితరులు పాల్గొన్నారు.