Breaking News Live Telugu Updates: మేడిగడ్డ బ్యారేజ్ లో మహారాష్ట్ర వాసి గల్లంతు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP Desam Last Updated: 24 Nov 2022 09:09 PM
Background
రానున్న 48 గంటల్లో ఉత్తర అండమాన్కు ఆనుకొని తుపాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రేపటికల్లా దీనిపై క్లారిటీ వస్తుందని పేర్కొంది. మరోవైపు నిన్నటి వరకు కొనసాగిన అల్పపీడనం పూర్తిగా బలహీన పడింది. దీని ప్రభావంతో రాయలసీమ,...More
రానున్న 48 గంటల్లో ఉత్తర అండమాన్కు ఆనుకొని తుపాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రేపటికల్లా దీనిపై క్లారిటీ వస్తుందని పేర్కొంది. మరోవైపు నిన్నటి వరకు కొనసాగిన అల్పపీడనం పూర్తిగా బలహీన పడింది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతంలో వర్షాలు పడొచ్చని అంచనా వేస్తోంది. తమిళనాడులో కూడా వానలు పడొచ్చని తెలిపింది వాతావరణ శాఖ. దక్షిణ ఆంధ్రప్రదేశ్-ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ దానికి ఆనుకొని ఉన్న పొరుగు ప్రాంతాలపై ఉంది. బుధవారం వివిధ ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. కోస్తా ఆంధ్రప్రదేశ్: తడ (నెల్లూరుజిల్లా) 9సెం.మీ.: సూళ్లూరుపేట (నెల్లూరు జిల్లా ) 9సెం.మీ.; రాయలసీమ: సత్యవేడు (చిత్తూరు జిల్లా) 9సెం.మీ. అల్పపీడన ప్రభావంతో మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4゚C కంటే తక్కువగా నమోదు కానున్నాయి. రాబోయే 5 రోజుల్లో ఒడిశాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 3-5⁰ C తగ్గే అవకాశం ఉంది. తెలంగాణలో వాతావరణంతెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమై ఉంమటుంది. హైదరాబాద్లో పొగమంచు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 21 డిగ్రీల మధ్య ఉండే ఛాన్స్ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు, గంటకు నాలుగు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీయొచ్చు. తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ 24, 25, 26 తేదీల్లో ఈ పరిస్థితి కనిపిస్తుందని అధికారులు ప్రకటించారు. మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదే విషయమై మంత్రి మల్లారెడ్డి, ఐటీ అధికారులు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే తమ అధికారిని మంత్రి బంధించారని ఐటీ అధికారులు ఫిర్యాదు చేశారు. అలాగే తాము సేకరించిన డాక్యుమెంట్లను మంత్రి మల్లారెడ్డి చించి పడేశారని, తమ ల్యాప్ టాప్ ను కూడా బలవంతంగా లాక్కున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐటీ అధికారులు తమపై దాడి చేసి బలవంతంగా తప్పుడు లెక్కలతో తమ సంతకం తీసుకున్నారని మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని కూడా కొట్టినట్లు చెబుతున్నారు. ఐటీ శాఖ అధికారులు చేసిన ఫిర్యాదును దుండిగల్ పోలీస్ స్టేషన్ కు అధికారులు ట్రాన్స్ ఫర్ చేశారు. మరోవైపు మల్లారెడ్డికి చెందిన ఆఫీస్లు, ఇళ్లలు, బంధువులు, రక్తసంబంధీకుల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు ముగిశాయి. తనిఖీల్లో దొరికిన నగదు, ఇతర ఆస్తులపై వివరణ ఇచ్చేందుకు ఐటీ కార్యాలయానికి రావాలని పిలుపునిచ్చింది. మంత్రి మల్లారెడ్డితోపాటు ఇద్దరు కుమారులు, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వియ్యంకుడు లక్ష్మా రెడ్డికి ఐటీ శాఖ నోటీసులు అందజేసింది. సోమవారం ఐటీ కార్యాలయం ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Warangal: క్షణికావేశంలో కుటుంబం ఆత్మహత్యాయత్నం, భార్యభర్తలు మృతి
వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. క్షణికావేశంలో ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో భార్యభర్తలు మృతి చెందగా.. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. వరంగల్ నగరంలోని గిర్మాజిపేట్ బొడ్రాయికి చెందిన నవధాన్ (33), స్రవంతి (28) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కొడుకులు. నవధన్ గోల్డ్ స్మిత్గా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగా గురువారం భార్యాభర్తలు నవధాన్, స్రవంతి, పెద్ద కొడుకు విషం తాగారు. దీంతో నవధాన్, స్రవంతి మృతి చెందగా.. పెద్ద కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే అతడిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు.