Breaking News Live Telugu Updates:పలాస టీడీపీ అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణరావుపై హత్యాయత్నం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 02 Apr 2023 07:42 PM
పలాస టీడీపీ అధ్యక్షుడు లక్ష్మణరావుపై హత్యాయత్నం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం టీడీపీ అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణరావుపై దుండగులు హత్యాయత్నం చేశారు. లక్ష్మణరావు కారుపై దాడి చేసి ధ్వంసం చేశారు. స్థానికులు చేరు కోవడంతో దుండగులు పరారయ్యారు. సోంపేట వైపు బస్సులో దుండగులు పరారయ్యారు. గాయపడిన లక్ష్మణరావును గౌతు శిరీష ఆసుపత్రికి తరలించారు.  

Eluru District: కుటుంబంపై కత్తులతో దాడి, ముగ్గురూ హత్య

  • ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగుడెంలో దారుణ ఘటన

  • గ్రామానికి చెందిన ఓ కుటుంబంపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి 

  • భార్యభర్తలతో పాటు చిన్నారిని కూడా కత్తితో నరికిన ఆగంతకులు

  • తీవ్ర గాయాలతో ప్రాణాపాయ పరిస్థితిలో కుటుంబం

  • జంగారెడ్డి గూడెం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

  • ఘటనపై మైసన్నగూడెంలో విచారణ చేపట్టిన పోలీసులు

Tirumala News: శ్రీవారి సేవలో‌ పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారిని‌ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఆదివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపి డెప్యూటీ సీఎం నారాయణ స్వామి, సినీనటుడు రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ లు వేర్వేరుగా స్వామి వారి‌ సేవలో పాల్గోని‌ మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల ‌మండపంలో‌‌ వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

Tirupati District News: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

తిరుపతి జిల్లా, కెవిబి.పురం మండలం, జ్ఞానమ్మకండ్రిగలో మునయ్య అనే రైతు అప్పుల బాధ తాళలేక తన పొలంలో ఆత్మహత్యకు ప్రయత్నించారు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తరలించగా చికిత్స పొందుతూ రైతు మునయ్య మృతి చెందారు. తనకున్న రెండు ఎకరాల పొలంతో పాటు మరి కొంత కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసే మునయ్య, వేసిన పంట నష్టం రావడంతో అప్పులు ఎలా తీర్చాలని బెంగతో ఆత్మహత్యకు పాల్పడాడు సమాచారం అందుకున్న సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మునయ్య నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా వారి కుటుంబాని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

AP Capital News: శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి చేరిన అమరావతి రథం

ఒకే రాష్ట్రం రాజధాని అని గళమెత్తుతూ అమరావతి రథం శనివారం మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి చేరుకుంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ 'రైతులు చేపట్టిన 'మహా పాదయాత్ర 2.0' గతేడాది నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ యాత్రలో రైతుల వెంట వచ్చిన రథాన్ని కూడా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిలిపివేశారు. ఆగిన రథాన్ని అరసవల్లి తీసుకువెళ్లి యాత్రకు ముగింపు పలకాలని రైతులు నిర్ణయించారు. ఆ మేరకు శుక్రవారం రామచంద్రపురంలో బయలుదేరిన రథం అరసవల్లి చేరుకుంది. అమరావతి నుంచి రైతులు కూడా వచ్చి నేడు అరసవల్లి సూర్యనారాయణస్వామి సన్నిధిలో మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం జిల్లాకు చేరుకున్నవారికి  ఓ కల్యాణ మండపంలో బస ఏర్పాటు చేశారు. ఆదివారం రథాన్ని ఆదిత్యాలయ సమీపంలో భక్తుల సందర్శనార్థం ఉంచనున్నారు.

TSPSC Update: నేడు ఐదో రోజు ముగ్గురు నిందితుల విచారణ

  • TSPSC పేపర్ లీకేజీ కేసులో నేడు ఐదవ రోజు ముగ్గురు నిందితుల విచారణ

  • సీసీఎస్ నుండి మరికొద్ది సేపట్లో హిమాయత్ నగర్ సిట్ కార్యాలయనికి ముగ్గురు నిందితులు 

  • నేడు ముగ్గురు నిందితుల చివరి రోజు విచారణ అనంతరం చంచల్ గూడ జైల్ కు తరలించనున్న సిట్ 

  • గ్రూప్ వన్ ప్రశ్నపత్రం లీకేజీ పై షమిమ్, రమేష్, సురేష్ లను విచారించి కీలక సమాచారం రాబట్టిన సిట్

Hyderabad ED Raids: రెండో రోజు కొనసాగుతున్న ఈడీ సోదాలు

  • రెండో రోజు కొనసాగుతున్న ఈడీ సోదాలు

  • జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, పఠాన్ చెరులోని పలు ఫార్మా, రియల్ స్టేట్, సాహితీ ఇన్ఫ్రాలో  కొనసాగుతున్న ED సోదాలు

  • నిన్న ఫీనిక్స్ సంస్థ ఫైనాన్స్ మేనేజర్ శ్రీనివాస్ ను పిలిచి విచారించిన ED

  • ఆర్థిక లావాదేవీలు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పై శ్రీనివాస్ ను ప్రశ్నించస్తున్న ED

  • ఫీనిక్స్ సంస్థ ఇప్పటి వరకు చేసిన, నిర్మాణ రంగం, మైనింగ్, ఆటోమొబైల్ వంటి  ఆర్థిక లావాదేవీలపై అరా తీస్తున్న ED

Software Engineer Murder: కారుపై పెట్రోల్ పోసి నిప్పు, లోపల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సజీవ దహనం

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లి గ్రామ సమీపంలో కారుపై దుండగులు పెట్రోల్ పోసి దహనం చేశారు. కారు మంటల్లో ఓ వ్యక్తి సజీవ దహనం అయినట్లు పోలీసులు గుర్తించారు. కారు నంబరు ఆధారంగా.. మృతుడు వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగి నాగరాజు అని గుర్తించారు. చంద్రగిరి పోలీసులు క్లూస్ టీంకి సమాచారం అందించి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేసిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Background

నేడు ఉత్తర - దక్షిణ ద్రోణి/గాలి విచ్చిన్నతి దక్షిణ ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉత్తర ఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతూ ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు: 
నిన్న తూర్పు మధ్యప్రదేశ్ నుండి తెలంగాణ వరకు ఉన్న ద్రోణి /గాలి విచ్చిన్నతి, ఈరోజు బలహీన పడింది. కాబట్టి, రాగల మూడు రోజులు తెలంగాణ  రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 5 వరకూ దాదాపు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేశారు.


Weather Warnings: వాతావరణ హెచ్చరికలు
ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో  కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది.


హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 36 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉత్తర దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 45 శాతం నమోదైంది.


ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలో నేడు ఎక్కడా వర్షాలు పడే అవకాశం లేదని అమరావతిలోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు లాంటి వాతావరణంతో పాటు బలమైన గాలులు దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకూ వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాలోని అన్ని జిల్లాల్లో ఈ రకమైన వాతావరణం ఉంటుందని తెలిపారు. వచ్చే 5 రోజుల పాటు ఇదే రకం వాతావరణ పరిస్థితి ఉంటుందని తెలిపారు.


ఢిల్లీలో వాతావరణం ఇలా..
ఏప్రిల్, జూన్ మధ్య దేశంలోని చాలా ప్రాంతాలలో తీవ్రమైన వేడి ఉండే అవకాశం ఉంది. భారత వాతావరణ విభాగం (IMD) శనివారం (ఏప్రిల్ 1) వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ద్వీపకల్ప ప్రాంతం మినహా, దేశంలోని చాలా ప్రాంతాల్లో ఏప్రిల్ నుండి జూన్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమయంలో, మధ్య, తూర్పు, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది.


ఏప్రిల్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కూడా అంచనా వేసింది. ఏప్రిల్‌లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ చెబుతోంది. వాయువ్య, మధ్య, ద్వీపకల్ప ప్రాంతంలోని చాలా ప్రాంతాలలో సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, అయితే తూర్పు, ఈశాన్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.