Breaking News:ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ షాక్... పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు..!
Breaking News: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్డేట్స్, వివరాలు మీకోసం
ABP Desam Last Updated: 07 Nov 2021 02:49 PM
Background
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు బాగా ఎగబాకింది. ఏకంగా గ్రాముకు రూ.40 చొప్పున పెరిగింది. మరోవైపు, వెండి ధరలో స్వల్ప పెరుగుదల కనిపించింది. కిలోకు రూ.100 వరకూ వెండి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం...More
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు బాగా ఎగబాకింది. ఏకంగా గ్రాముకు రూ.40 చొప్పున పెరిగింది. మరోవైపు, వెండి ధరలో స్వల్ప పెరుగుదల కనిపించింది. కిలోకు రూ.100 వరకూ వెండి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో రూ.45,100 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.49,200 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.68,700గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఈ ధర రూ.100 పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. హైదరాబాద్లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా ముందు రోజుతో పోల్చితే నిలకడగానే ఉంది. ఇక వరంగల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.0.19 పైసలు పెరిగింది. దీంతో తాజా ధర రూ.107.88 అయింది. డీజిల్ ధర రూ.0.17 పైసలు పెరిగి రూ.94.31 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.ఇక విజయవాడ మార్కెట్లో పెట్రోల్ ధర రూ.0.63 పైసలు పెరిగి ప్రస్తుతం రూ.110.98 గా ఉంది. డీజిల్ ధర రూ.0.56 పైసలు పెరిగి రూ.97.00కి చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి. విశాఖపట్నం ఇంధన మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.05గా ఉంది. పాత ధరతో పోలిస్తే లీటరుకు రూ.0.27 పైసలు తగ్గింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.18గా ఉంది. ఇది లీటరుకు రూ.0.25 చొప్పున తగ్గింది.అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామంలో విషాద ఘటన శనివారం జరిగింది. కొర్రపాడుకు చెందిన వెంకటస్వామి(56) జిల్లాలోని పామిడి పోలీస్ స్టేషన్లో ఏఎస్సై గా విధులు నిర్వహిస్తున్నారు. వెంకటస్వామికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు గోవర్ధన్ వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు.అనుకున్న ముహూర్తానికే వివాహం జరిపించారు. మూడు రోజుల కిందట వెంకటస్వామి తల్లి కొన్నమ్మ అస్వస్థతకు గురికావడంతో అనంతపురంలోని ఓ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మనవడు గోవర్ధన్ వివాహం జరిగిన కొంత సమయానికే కొన్నమ్మ నిపోయింది. ఈ విషయాన్ని వెంకటస్వామి బంధువులు ఆయనకు ఫోన్ చేసి సమాచారం అందించారు. తల్లి చనిపోయిందన్న వార్త విని షాక్ కు గురైన ఏఎస్సై వెంకటస్వామి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ షాక్... పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు
తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయి. ఖైరతాబాద్లోని రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో పల్లెవెలుగు బస్సులకు కిలోమీటరుకు 25 పైసలు, ఎక్స్ప్రెస్లు ఆపై సర్వీసులకు 30 పైసలు, సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు, మెట్రో డీలక్స్ సర్వీసులకు 30 పైసలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడనుంది.