Breaking News:ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ షాక్... పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు..!

Breaking News: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 07 Nov 2021 02:49 PM

Background

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు బాగా ఎగబాకింది. ఏకంగా గ్రాముకు రూ.40 చొప్పున పెరిగింది. మరోవైపు, వెండి ధరలో స్వల్ప పెరుగుదల కనిపించింది. కిలోకు రూ.100 వరకూ వెండి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం...More

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ షాక్... పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు 

తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయి. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో పల్లెవెలుగు బస్సులకు కిలోమీటరుకు 25 పైసలు, ఎక్స్‌ప్రెస్‌లు ఆపై సర్వీసులకు 30 పైసలు, సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు, మెట్రో డీలక్స్‌ సర్వీసులకు 30 పైసలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడనుంది.