Breaking News Live: మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్.. 12.4 కోట్లు మాయం..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్డేట్స్, వివరాలు మీకోసం
ABP Desam Last Updated: 24 Jan 2022 07:07 PM
Background
తెలుగు రాష్ట్రాల్లో నేడు సైతం అకాల వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాల కారణంగా ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరిగిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో వాయువ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో...More
తెలుగు రాష్ట్రాల్లో నేడు సైతం అకాల వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాల కారణంగా ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరిగిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో వాయువ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోనూ నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలో ఎలాంటి వాతావరణ హెచ్చరికలు జారీ కాలేదు.కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. జనవరి 26 వరకు తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురవనుండగా.. మరికొన్ని చోట్ల ఓ మోస్తరు జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి సమస్య ఉండదని అధికారులు సూచించారు. ఏపీలో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత వర్షాల కారణంగా పెరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, యానాం, (పుదుచ్చేరి)లలో నేడు వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యల్పంగా కళింగపట్నంలో 17.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తగ్గలేదు కానీ వర్షాల కారణంగా చలి గాలులు వీస్తున్నాయి.దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోనూ నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి రెండు రోజులపాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడతాయి. ఇటీవల కురిసిన వర్షాలతో చలి ప్రభావం మరింతగా పెరుగుతోంది. అనంతపురంలో 17 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 18.5 డిగ్రీలు, నంద్యాలలో 19 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో వర్షాలు..తెలంగాణలో అకాశం నిర్మలమై ఉంటుంది. ఉదయం వేళలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. పశ్చిమ, వాయువ్య దిశల నుంచి గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత అధికమైంది. కనిష్ట ఉష్ణోగ్రత 18.5 ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 33.5 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో నే కొన్ని జిల్లాల్లో పలు చోట్ల తేలిక పాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.బంగారం, వెండి ధరలుభారత్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ(సోమవారం) గ్రాముకి ఒక రూపాయి తగ్గింది. కానీ వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.47,520 ఉండగా, 24 క్యారెట్ల ధర 10 గ్రాములు రూ.49,520గా ఉంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలివేహైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900, 24 క్యారెట్ల ధర రూ.49,630దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,790, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,870, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,040ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,520, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,520కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,690, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,390బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630 కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630వెండిధరలు: భారత మార్కెట్ లో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి రూ.64,900 ఉండగా, చెన్నైలో రూ.69,000గా ఉంది. ముంబయిలో కిలో వెండి రూ.64,900 ఉండగా, కోల్కతాలో రూ.64,900, బెంగళూరులో కిలో వెండి రూ.69,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.69,000 ఉండగా, విజయవాడ, విశాఖలో కూడా రూ. 69,000 వద్ద కొనసాగుతోంది.అనేక అంశాలపై బంగారం, వెండి ధరలుబంగారం, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్.. 12.4 కోట్లు మాయం..
మహేష్ బ్యాంక్ మెయిన్ సర్వర్ ను సైబర్ కేటుగాళ్ళు హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. మెయిన్ సర్వర్ హ్యాక్ చెసి 12.4 కోట్ల రూపాయలు కాజేశారు. వెంటనే 12.4 కోట్లు.. 127 వేరు వేరు బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు మహేష్ బ్యాంక్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.