AP Telangana Breaking: ఏపీలో ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లకు జైలు శిక్ష.. రూ.లక్ష జరిమానా వేసిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్‌డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 02 Sep 2021 01:32 PM

Background

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఆయన తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్లిన వైఎస్ జగన్.. వైఎస్ ఘాట్ వద్ద కాసేపు గడిపారు....More

ముగ్గురు ఐఏఎస్‌లకు జైలు శిక్ష

ఏపీలో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. అంతేకాక, రూ.లక్ష చొప్పున జరిమానా కూడా విధించింది. ఐఏఎస్‌లు రావత్, ముత్యాలరాజు, శేషగిరి రావు విషయంలో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఈ జైలు శిక్షపై అప్పీల్‌కు వెళ్లేందుకు నెల రోజుల పాటు అవకాశం విధించింది. భూ వ్యవహారంలో నష్ట పరిహారం చెల్లించలేదని సీరియస్ అయిన హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. బాధిత మహిళకు అధికారులు రూ.లక్ష సొంత డబ్బులు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ప్రతి వాదుల వాదనతో శిక్షను నాలుగు వారాలపాటు నిలుపుదల చేసింది.