AP MPTC ZPTC Elections 2021: ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లో ఉన్నవారికి ఓటేసే అవకాశం

నేడు ఏపీలోని 10 జెడ్పీటీసీ స్థానాలకు, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి.

ABP Desam Last Updated: 16 Nov 2021 05:23 PM
ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లో ఉన్నవారికి ఓటేసే అవకాశం

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. క్యూలైన్లో ఉన్నవారికి ఓటేసే అవకాశం ఉంది. 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 14 జడ్పీటీసీ స్థానాలకుగాను నాలుగు ఏకగ్రీవం అయ్యాయి. 176 ఎంపీటీసీ స్థానలకు గాను 50 ఏకగ్రీవం అయ్యాయి.

ఏపీలో ప్రశాంతంగా కొనసాగుతున్న పరిషత్ ఎన్నికలు

అనంతపురం మురడి పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 29 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, తూర్పు గోదావరి, విశాఖ, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 

చిత్తూరు జిల్లాలో పోలీసులపై వైఎస్సార్ సీపీ నేత దౌర్జన్యం

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పోలీసులపై వైఎస్సార్ సీపీ నేత, ఎస్.ఆర్.పురం‌ మండలం సింగల్ విండో ప్రెసిడెంట్, జిల్లా డీసీసీ డైరెక్టర్ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎస్.ఆర్.పురం మండలంలోని వి.వి.పురం ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ బూత్ వద్ద పోలీసులతోనే వాగ్వావాదానికి దిగారు. జైలుకు వెళ్లడం తనకు కొత్త కాదని.. మీరు లోపల వేసినా నేను బయటకు వస్తానంటూ పోలీసులకు ఎదురు తిరిగారు. పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లమని చెప్పినందుకు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా మొదలైన పోలింగ్..

నెల్లూరు జిల్లాలో ఎంపీటీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. జిల్లాలో మొత్తం 7 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వాటిలో 3 ఏకగ్రీవం అయ్యాయి. మిగతా నాలుగు చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. కోట మండలంలో కోట ఎంపీటీసీ స్థానానికి, కోవూరు మండలంలోని గంగవరం ఎంపీటీసి స్థానానికి, సైదాపురం మండలంలో అనంతపురం స్థానానికి పోలింగ్ మొదలైంది. మొత్తం 12మంది అభ్యర్థులు ఈ మూడు స్థానాలకు పోటీ పడుతున్నారు. కోవూరు మండలం గంగవరంలో ఎంపీటీసీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉండగా.. ఇక్కడ 1802మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఉదయం చిరు జల్లులు పడుతున్నా ఓటర్లు పోలింగ్ బూత్ లకు చేరుకున్నారు.

సాయంత్రం 5 గంటల వరకు పరిషత్ పోలింగ్‌

శ్రీకాకుళంలో 1, విశాఖపట్నంలో 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 1, కృష్ణాలో 3, గుంటూరులో 1, చిత్తూరులో 1, కర్నూలులో 1, అనంతపురంలో ఒక్క జెడ్పీటీసీ స్థానాలకు 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది.

ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

నేడు ఏపీలోని 10 జెడ్పీటీసీ స్థానాలకు, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పలు కారణాలతో గతంలో ఆగిపోయిన చోట్ల, గెలిచిన అభ్యర్థులు మరణించిన స్థానాల్లో మంగళవారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. వీటితో పాటు గతంలో ఓట్ల లెక్కింపు సమయంలో తడిసిన ఓట్ల కారణంగా లెక్కింపు ఆగిపోయిన కడప జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలో రెండు బూత్‌లతోపాటు మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లోను రీపోలింగ్ మొదలైంది.

Background

ఏపీలో వరుసగా మూడోరోజు ఎన్నికల సందడి మొదలైంది. ఆదివారం, సోమవారం పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. నేడు ఏపీలోని 10 జెడ్పీటీసీ స్థానాలకు, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పలు కారణాలతో గతంలో ఆగిపోయిన చోట్ల, గెలిచిన అభ్యర్థులు మరణించిన స్థానాల్లో మంగళవారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. వీటితో పాటు గతంలో ఓట్ల లెక్కింపు సమయంలో తడిసిన ఓట్ల కారణంగా లెక్కింపు ఆగిపోయిన కడప జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలో రెండు బూత్‌లతోపాటు మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లోను రీపోలింగ్ మొదలైంది. 


ఏపీ ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో ఎన్నికలు జరగాల్సి ఉన్న 14 జెడ్పీటీసీ స్థానాలు, 176 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు ఇటీవల నోటిఫికేషన్‌ జారీచేసింది. నేడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read: ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో చిరు జల్లులు కురిసే ఛాన్స్ 


ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని అధికారులు తెలిపారు. నేడు జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం 8,07,640 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 954 పోలింగ్‌ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నేడు ఏదైనా అవకతవకలు జరిగితే బుధవారం రీ పోలింగ్ నిర్వహడానికి ఏపీ ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉంది.  గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కించి గెలిచిన అభ్యర్థుల పేర్లు ప్రటిస్తారు. మొత్తం 7 వేల సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.
Also Read: టీడీపీ కంచుకోట బద్దలవుతుంది... దొంగ ఓట్ల సంస్కృతి వైసీపీకి లేదు... చంద్రబాబుకు సజ్జల కౌంటర్ 


మొత్తం 14 జెడ్పీటీసీ, 176 ఎంపీటీసీ స్థానాలకు ఏపీ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా.. అందులో 4 జెడ్పీటీసీ, 50 ఎంపీటీసీ స్థానాల ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి. 3 ఎంపీటీసీ స్థానాల్లో ఎవరూ నామినేషన్ల దాఖలు చేయకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. పోలింగ్ జరుగుతున్న 10 జెడ్పీటీసీ స్థానాలకు 40 మంది, ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది బరిలో నిలిచారు. ఈనెల 18న ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన చేయనున్నారు. 
Also Read: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం... ప్రజావ్యతిరేకత తట్టుకోలేక కుట్రలు... వైసీపీపై చంద్రబాబు ఫైర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.