AP Congress News: ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. ఇది కాంగ్రెస్ రెండో జాబితా కాగా.. ఇందులో 12 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించారు. అలాగే మరో 6 లోక్ సభ స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఈ అభ్యర్థులను కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఖరారు చేసినట్లుగా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ఐదు లోక్‌సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్‌ మొత్తంగా 11 లోక్‌సభ, 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది. 

అసెంబ్లీ అభ్యర్థులు..

  • టెక్కలి - కిల్లి కృపారాణి
  • భీమిలి - అడ్డాల వెంకట వర్మరాజు
  • విశాఖ సౌత్‌ - వాసుపల్లి సంతోష్‌
  • గాజువాక - లక్కరాజు రామరాజు
  • అరకు వ్యాలీ (ఎస్టీ) - శెట్టి గంగాధరస్వామి
  • నర్సీపట్నం - రౌతుల శ్రీరామమూర్తి
  • గోపాలపురం (ఎస్సీ) - ఎస్‌. మార్టిన్‌ లూథర్‌
  • ఎర్రగొండపాలెం (ఎస్సీ) - డా. బూధల అజిత రావు
  • పర్చూరు - నల్లగోర్ల శివ శ్రీలక్ష్మి జ్యోతి
  • సంతనూతలపాడు (ఎస్సీ) - విజేష్‌ రాజు పాలపర్తి
  • గంగాధర నెల్లూరు (ఎస్సీ) - డి. రమేష్‌ బాబు
  • పూతలపట్టు (ఎస్సీ) - ఎంఎస్‌ బాబు

లోక్‌సభ అభ్యర్థులు..

  • విశాఖపట్నం - పులుసు సత్యనారాయణ రెడ్డి
  • అనకాపల్లి - వేగి వెంకటేశ్‌
  • ఏలూరు - లావణ్య కావూరి
  • నరసరావుపేట - గార్నెపూడి అలగ్జాండర్‌ సుధాకర్‌
  • నెల్లూరు - కొప్పుల రాజు
  • తిరుపతి (ఎస్సీ)- డా. చింతా మోహన్‌