AP CM YS Jagan: పోతవరం జెడ్పీ స్కూల్‌‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్.. భుజాన స్కూల్ బ్యాగు.. లైవ్ అప్‌డేట్స్

నేటి నుంచి ఏపీలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పాఠశాలలను విద్యార్థులకు అంకితం చేయనున్నారు.

ABP DesamLast Updated: 16 Aug 2021 01:05 PM

Background

ఏపీలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. మనబడి నాడు–నేడు ద్వారా రూ.3,669 కోట్లతో తొలి విడతలో 15,715 స్కూళ్లను ఆధునీకరిస్తోంది...More

భుజాన స్కూల్ బ్యాగ్ వేసుకున్న సీఎం

పోతవరం జెడ్పీ స్కూల్‌లో విద్యార్థుల పాఠ్య పుస్తకాలను ఏపీ సీఎం వైఎస్ జగన్ పరిశీలించారు. భుజాన స్కూల్ బ్యాగ్ వేసుకుని తన స్కూల్ రోజులను గుర్తు సీఎం గుర్తుచేసుకున్నారు. క్లాస్ రూమ్‌లోకి వెళ్లిన సీఎం విద్యార్థుల పక్కనే బెంచీ మీద కూర్చున్నారు.