Breaking News Live: కర్ణాటకలో బస్సు బోల్తా, ఎక్కువ సంఖ్యలో మృతులు!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 19 Mar 2022 10:36 AM
Karnataka Bus Accident: కర్ణాటకలో బస్సు బోల్తా, ఎక్కువ సంఖ్యలో మృతులు!

కర్ణాటకలో YNH కోట నుంచి పవగడకు వెళుతున్న SVT బస్సు బోల్తా పడింది. దాదాపు 15 మంది వరకు మరణించినట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Accident: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం

హైదారాబాద్‌లోని గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లా హోటల్‌ సమీపంలో ప్రమాదం జరిగింది. స్పీడ్‌గా దూసుకొచ్చిన కారు మహిళలపైకి దూసుకెళ్లింది. ఆ యాక్సిడెంట్‌లో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఉన్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ 28 సీఎల్1134 నెంబర్‌తో ఉన్న ఫోర్డు కారు మహిళను ఢీ కొట్టి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది.  

విజయనగరం జేసీని రీ కాల్ చేసిన ఏపీ ప్రభుత్వం

విజయనగరం: జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్‌ను విధులు నుంచి ఏపీ ప్రభుత్వం రీ కాల్ చేసింది. జిల్లాలో భూ బదలాయింపుల్లో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. గతంలో మంత్రి బొత్స కాళ్ళు పట్టుకొని వివాదాస్పదంగా మారిన జేసీ. 
విజయనగరంలో జిల్లా స్థాయి ఐఏఎస్ అధికారిని రీకాల్ చేయడం ఇదే తొలిసారి. రెవెన్యూ విభాగంలో జేసీగా పని చేస్తున్నారు కృష్ణ కిషోర్.

Fire Accident In Visakha: విశాఖలో అగ్నిప్రమాదం - అగ్గిపెట్టెల లారీకి మంటలు

విశాఖలో అగ్నిప్రమాదం - అగ్గిపెట్టెల లారీకి మంటలు
విశాఖలో అగ్నిప్రమాదం జరిగింది. పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం వద్ద అగ్గిపెట్టెలు తీసుకు వచ్చే లారీకి అగ్నిప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు సబ్బవరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చింది. 

Hyderabad Flyovers closed: నేడు హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ల మూసివేత

Hyderabad Flyovers closed: ‘షబ్‌-ఏ-బరాత్’ సందర్భంగా శుక్రవారం రాత్రి 10 గంటల తరువాత హైదరాబాద్‌లోని ఫ్లై ఓవర్లు మూసివేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా నెక్లెస్‌ రోడ్డు (పి.వి.ఎన్‌.ఆర్‌ మార్గ్)తో సహా నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లు మూసివేయనున్నట్లు ట్రాఫిక్ అడిషనర్ కమిషనర్ తెలిపారు. అయితే గ్రీన్‌లాండ్‌ ఫ్లైఓవర్‌, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే ఫ్లై ఓవర్లకు దీని నుంచి మినహాయింపు కల్పించినట్లు పేర్కొన్నారు.

Background

ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య నెలకొన్ని యుద్ధ వాతావరణం పలు దేశాల మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గరిష్ట ధరలకు చేరుకుంటున్నాయి. తాజాగా బంగారం ధర పెరిగింది. రూ160 మేర పెరగడంతో హైదరాబాద్‌లో తాజాగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,450 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.51,760 కి ఎగబాకింది. స్వచ్ఛమైన వెండి ధర రూ.600 మేర పుంజుకోవడంతో నేడు హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.72,900 కు చేరింది.


ఏపీలో బంగారం ధర.. (Gold Rate In Andhra Pradesh)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు మూడు రోజుల తరువాత నేడు పెరిగాయి. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 18th March 2022)  10 గ్రాముల ధర రూ.51,760 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450కి చేరింది. విజయవాడలో వెండిపై రూ.600 తగ్గడంతో 1 కేజీ ధర రూ.72,900 కి పతనమైంది. విశాఖపట్నం, తిరుపతిలో రూ.150 మేర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,450 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.72,900 అయింది.  


ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న వేడిగాలుతో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం పొడిగా మారింది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు వేర్వేరు ప్రకటనల్లో హెచ్చరించాయి. మరోవైపు దక్షిణ బంగాళాఖాతంలో మార్చి 16న అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కదులుతూ 19వ తేదీన తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ అల్పపీడనం మరింతగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  


ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో మధ్యాహ్నం ఉక్కపోత వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖ నగరంలో ఉక్కపోత మరింత ఎక్కువైంది. పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటడంతో ఉక్కపోత అధికం కానుంది. నేటి నుంచి రెండు రోజులపాటు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరణం పొడిగా మారుతుంది. కొన్నిచోట్ల వడగాల్పులు వీచడంతో ఉక్కపోత అధికం. ప్రజలు వేడిని తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వాతావరణ కేంద్రం పేర్కొంది. 


హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు సైతం పెట్రోల్ ధర లీటర్ (Petrol Price Today 18th March 2022) రూ.108.20 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 102 డాలర్లకు దిగొచ్చింది. 


ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర పెరిగింది.  వరంగల్‌లో 46 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.107.69 కాగా, డీజిల్‌‌పై 43 పైసలు దిగిరావడంతో లీటర్ ధర రూ.94.14 కు పతనమైంది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్‌ లీటర్ ధర రూ.107.88 కాగా, డీజిల్‌‌  లీటర్ ధర రూ.94.31 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
కరీంనగర్‌లో ఇంధన ధరలు నేడు నిలకడగా ఉన్నాయి. 


విజయవాడలో పెట్రోల్‌ పై 56 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.91 కాగా, ఇక్కడ డీజిల్ పై 52 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.96 అయింది. 
విశాఖపట్నంలో ఇంధన ధరలు తగ్గాయి. 50 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.40 అయింది. డీజిల్‌పై 46 పైసలు పెరిగి లీటర్ ధర రూ.95.51గా ఉంది. చిత్తూరులో ఇంధన ధరలు భారీగా దిగొచ్చాయి. పెట్రోల్‌ పై 72 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.110.46కి పతనమైంది. డీజిల్ పై 64 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.96.52 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.