AP Budget Session 2024 Live: ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్న బుగ్గన

AP Budget Live: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు నేడు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ సమావేశం కానుంది.

ABP Desam Last Updated: 07 Feb 2024 01:27 PM
అన్నపూర్ణ ఆంధ్ర లక్ష్యంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టాం: బుగ్గన

రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడానికి వ్యవసాయంలో గణనీయమైన ఉత్పత్తి సాధించి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వ సమగ్ర వ్యూహాన్ని రూపందించింది. దీనిలో భాగంగా ధరల స్థిరీకరణ నిధి, పంట భీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ మొదలైన చర్యల ద్వారా రైతులకు ఆర్థిక సహాయం లభించింది. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద లక్షా 60 కౌలుదారులకు, 93 వేల అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు 53 లక్షల 53 వేల మంది ఖాతాల్లో 33,300 కోట్ల రూపాయలు జమ చేసింది. 


వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా ద్వారా 54 లక్షల 55 వేల మంది రైతుల ఖాతాల్లో 7, 802 కోట్ల రూపాయల బీమా అందిస్తోంది. వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల ద్వారా 2019 నుంచి 73 లక్షల 88 వేల మంది రైతులకు 1,835 కోట్ల రూపాయలు అందించింది. 
10,778 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు ఇంటి వద్దే సేవలు అందిస్తోంది. 19 లక్షలకుపైగా ఉన్న వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లకు కోతలు లేని రోజువారీ 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తోంది. 2019 నుంచి ఈ పథకం ద్వారా 37,374 కోట్ల రూపాయల సబ్సిడీ అందిస్తోంది. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు పంటలు విక్రయించే వారి కోసం 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద 22 లక్షల 85 వేల మంది రైతులకు 1,977 కోట్ల రూపాయలు అందించింది. మరో 1200 కోట్ల రూపాయలు ఈ నెలలో ఇయ్యబోతోంది. 


127కొత్త వైఎస్‌ఆర్‌ వ్యవసాయ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా పంట కోత అనంతర మౌలిక సదుపయాలు కల్పించింది. వైఎస్‌ఆర్‌ యంత్రసేవా పథకం ద్వారా వ్యవసాయ యంత్రాలను అందిచేయడమే కాకుండా గ్రామ యువతకు డ్రోన్ పైలట్ శిక్షణ అందించారు. 


ఉద్యనవన రంగం అభివృద్ధి కోసం 17 లక్షల 27 వేల మంది రైతులకు లబ్ధి చేకూరేలా వివిధ పథకాల ద్వారా 4,363 కోట్ల రూపాయలు అందించాం. 2,356 మంది గ్రామస్థాయి ఉద్యానవన సహాయకులను నియమించింది. ంట నిల్వ కోసం 462 వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు 84 సౌర శీతల గిడ్డంగులు, 2,905 ప్యాక్ హౌస్‌లును ఏర్పాటు చేసింది. 


జగన్న పాల వెల్లువ పథకం ద్వారా రైతులకు లబ్ధి కలిగేలా అమూల్‌ సంస్థతో చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ చేశాం. దీని వల్ల ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి కలుగుతోంది.


వైఎస్‌ఆర్‌ పశు బీమా పథకం ద్వారా పశువులకు బీమా సౌకర్యం కల్పించాం. వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవ ద్వారా 340 సంచార పశు వైద్యశాలల సేవలను రైతలకు ఇంటి వద్దే అందిస్తున్నాం. 


వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కింద 2 లక్షల 43 వేల మంది మత్స్యకార కుటుంబాలకు చేపల వేట నిషేధ కాలంలో 4 వేల నుంచి పది వేల వరకు  ఆర్థిక సాయం చేస్తున్నాం. 20,034 మత్స్యకారుల పడవలకు వాడే డీజిల్‌ ఆయిల్‌పై లీటర్‌కు 6 రూపాయల 3 పైసల నుంచి 9 రూపాయల సబ్సిడీ పెంచడం జరిగింది. అకాల మరణానికి గురైన వారికి ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల పరిహారం ఇస్తున్నాం. 


అంతర్జాతీయ ప్రమాణాలతో 10 ఫిషింగ్ హార్బర్‌లు నిర్మించాం. గ్రామస్థాయిలో ఆక్వా రైతులు ఉపయోగించే పనిముట్లు పరీక్షించే సౌకర్యాలను అందించడానికి 35 సమీకృత మత్స్య సంపద ప్రయోగ శాలలు ఏర్పాటు చేసింది. 2000 ఫిష్‌ ఆంధ్రా రిటైల్‌ దుకాణాలు స్థాపించాం. 


మత్స్య సంపద ఉత్పత్తిని ప్రోత్సహించి దాని నియంత్రణ పర్యవేక్షణ కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మత్స్య సంపద అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేశాం. పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన ఫిషరీ సైన్సెస్‌ విశ్వవిద్యాలయం ఏప్రిల్‌ 1, 2022 నుంచి పని చేస్తోంది. 

ఈ పథకాలతో మహిళలను మహారాణులను చేస్తున్నాం: బుగ్గన  

జనాభాలో సగం మంది సంక్షేమ సాధికరాతకు నోచుకోని ఏ రాష్ట్రమైనా పురోగతి సాధించలేదు. దీనిని గుర్తించి మహిళలకు సాధికారతపై దృష్టి సారించి భారీ స్థాయిలో అనేక వినూత్న కార్యక్రమాలు ప్రారంభించింది. అందులో భాగంగా 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి జెండర్‌ చైల్డ్ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నాం. జగనన్న అమ్మ ఒడి పథకం ప్రవేశ పెట్టి అందరికీ విద్య అందేలా చేస్తున్నాం. దీని కింద 43 లక్షల 61 వేల మంది మహిళలకు 26, 067 కోట్ల రూపాయలు అందించాం. ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుంది. దీని ఫలితంగా ప్రాథమిక విద్యలో బడిలో చేరే విద్యార్థుల సంఖ్య 2019 87.8 శాతం ఉంటే.. 2023 నాటికి అది 98.73శాతానికి పెరిగింది. ఉన్నత మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2019లో 46.88 ఉంటే... 2023 నాటికి 79.69కి పెరిగింది. 


మహిళా సంఘాల బకాయిలు చెల్లించేందుకు వైఎస్‌ఆర్‌ ఆసరా పథకాన్ని ప్రవేశ పెట్టాం. 2019 నుంచి 7 లక్షల 98 వేల స్వయం సహాయ సంఘాలలోని 78 లక్షల 94 వేల మంది మహిళలు ఉపశమనం కల్పించాం. వారికి 25, 571 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాం. వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం కింద 4,969 కోట్ల రూపాయలను పంపిణీ చేశాం. 18.36 శాతం గా ఉన్న బకాయిలు దేశంలోనే అతి తక్కువ స్థాయి అయిన 0.17 శాతానికి చేరాయి. 


వైఎస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా 26 లక్షల మంది మహిళలకు 14,129 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. జగనన్న పాలవెల్లువ పథకం కింద 3 లక్షల 60 వేల మంది మహిళలకు డెయిరీ ద్వారా లబ్ధి చేకూర్చేందుకు 2,697 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. స్త్రీల, పిల్లల భద్రత కోసం దిశా మొబైల్ యాప్‌ను, దిశా పెట్రోల్‌ వాహనాలను, 26 దిశా పోలీస్‌ స్టేషన్‌లను ప్రారంభించాం. 

సంవరించిన అంచనాలు 2025-24

2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వ్యయం కోస సంవరించిన అంనచాలు 2,28,237,77 కోట్లు అయితే మూల ధన వ్యయం కోసం 27,308.12 కోట్లు, రెవెన్యూ లోటు దాదాపు 31,534.94 కోట్లు, అదే కాలానికి ద్రవ్య లోటు దాదాపు 60,153.59 కోట్లు, ఇది జీఎస్‌డీపీలో వరుసగా 2.19 , 4.18 శాతంగా ఉన్నాయి. 

నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం: బుగ్గన

రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య సంరక్షణా సేవలను సమర్థవంతంగా అందించడంలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు కీలక పాత్రను పోషిస్తాయని భావించి... ఆరోగ్య రంగంలో నాడు నేడు పథకాన్ని అమలు చేయటం చేస్తున్నాం. ఆరోగ్య కేంద్రం మొదలు కొని బోధనాసుపత్రుల వరకు 16,852 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 24X7 పని చేసేలా రోజూ రెండు షిప్టుల్లో పనిచేసేలా పునరుద్దరించాం. 


ప్రజలకు ఇంటి వద్దే ఆరోగ్య సేవలు అందించేందుకు ఫ్యామిలీ డాక్టర్‌ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 2,284 మంది వైద్యులతో 14 రకాల వైద్య పరీక్షలను 105 రకాల మందను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. 


మండలానికి కనీసం ఒక యూనిట్ చొప్పున 108 అంబులెన్స్‌ సర్వీసును, 104 సంచార ఆరోగ్య వాహన బృంాలను ఏర్పాటు చేశాం. 
ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత ఎక్కువ మందికి చేరువ చేసే ఆలోచనతో కుటుంబ ఆదాయ అర్హత పరిమితిని 2 లక్షల 50 వేల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పెంచాం. సంవత్సరానికి 25 లక్షల రూపాయల వరకు నగదు రహిత వైద్య సేవలను అందిస్తున్నాం. ఆరోగ్య శ్రీ వ్యాధుల పరిధిని కూడా 1,059 నుంచి 3,257కి పెంచాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో కూడా చికిత్స తీసుకునేలా చేస్తున్నాం. కిడ్నీ రోగులకు కార్పొరేట్‌ స్థాయి చికిత్స ఉచితంగా చేస్తున్నాం. 200 పడకల కిడ్నీ రీసెర్చ్‌ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పలాసలో ఏర్పాటు చేశాం. 


జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా 10, 574 ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించి రాష్ట్రంలో కోటీ 67 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు మందులు అందించడం జరిగింది. 


నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా 53, 126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించడం జరిగింది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పషలిస్టు వైద్యుల పోస్టుల ఖాలీలు సగట 61 శాతం ఉంటే.. ఏపీలో నాలుగు శాతమే ఉందన్నారు. 
పరిశ్రమల అవసరాలకు సరిపోయే విధంగా స్థిరమైన వృద్ధిని సాధించేందుకు యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 192 స్కిల్ హ్‌లు, పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో 27 స్కిల్‌ కాలేజీలు స్థాపించాం. దీని ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 21 రంగాల్లో లక్షా 6 మంది అభ్యర్థులు శిక్షణఇవ్వగా వీరిలో 95 శాతం మంది ఉద్యోగావకశాలు పొందారు. 


విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి 201 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో వర్చువల్‌ ల్యాబ్‌లు, క్లాస్‌ రూమ్‌లు ఏర్పాటు చేయడంతోపాటు 14 పారిశ్రామిక శిక్షణా కేంద్రాల్లో కియా మోటార్స్, మారుతీ, టయోటా, ఇసుజు, హిటాచీ, సామ్సంగ్‌ సంస్థల సాయంతో అధునాతన యంత్రాలు యంత్ర పరికరాలు ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం 

ఉన్నత విద్యలోనూ అద్భుతాలు చేస్తున్నాం: బుగ్గన

అర్హులైన వారందరికీ ఉచిత ఉన్నత విద్య అందిస్తున్న రాష్ట్రం ఏపీ మాత్రమే. జగనన్న విద్యా దీవెన ద్వారా 11,901 కోట్ల రూపాయలు, జగనన్న వసతి దీవెన ద్వారా 4,276 కోట్లరూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటి వరకు 52 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఉన్న విద్యలో డ్రాప్ అవుట్ శాతం 2018-19లో 20.37 శాతం ఉంటే... 2022-23 లో 6.62 శాతంగా ఉంది. 


ప్రపంచవ్యాప్తంగా 50 యూనివర్శిటీల్లో చదువుకోవలనుకునే వాళ్లకు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా కోటీ 25 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటి వరకు 1858 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. 


రాష్ట్రంలో లక్షా 95 వేల కంటే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు స్వల్పకాలిక ఇంటర్న్‌ షిప్‌ను పూర్తి చేయగా వీరిలో చాలా మంది మైక్రోసాఫ్ట్‌, సేల్స్‌ఫోర్స్‌ లాంటి కంపెనీల్లో పని చేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో వైద్య, దంత వైద్య కోర్సుల్లో 50 శాతం కోటా, మిగతా అన్ని కోర్సుల్లో 35 శాతం కోటాను ప్రభుత్వ కోటోగా అమలు చేస్తోంది. దీని ఫలితంగా 2,118 మంది విద్యార్థులకు ఈ చదువులు లభిస్తున్నాంయ. 

మానవ మాలధన అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం: బుగ్గన

సామర్థ్య ఆంధ్ర
గత ఐదేళ్లులో మానవ మాలధన అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా తట్టుకొని నిలబడే శక్తిని కల్పించింది. ప్రపంచస్థాయిపోటీకి సిద్దం చేయడానికి మా ప్రభుత్వం పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టింది. వెయ్యి పాటశాలల్లో చదువుకుంటున్న 4,39,595 మంది విద్యార్థులను సెంట్రల్‌ బోర్డ్ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ పరిధిలోకి తీసుకొచ్చింది. అన్ని ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో ఇంటర్‌నేషనల్ బాకలారియాట్‌ పాఠ్యప్రణాలిక కిందకు తీసుకొస్తున్నాం. ప్రతి ఒక విద్యార్థికి టోఫెల్ సర్టిఫికేట్ అందిస్తున్నాం. 
విద్యాబోధనను సులభతరం చేసేందుకు 62 వేల ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌ను వినియోగంలోకి తీసుకొచ్చాం. స్వీయ అభ్యాసనను ప్రోత్సహించేందుకు పాఠ్యాంశాలతో కూడిన 9,52,925 ట్యాబ్‌లను ఇచితంగా విద్యార్థులకు అందించాం. దీని వల్ల 4వ తరగత నుంచి 12వ తరగతి వరకు 34 లక్షల 30 వేల మంది విద్యార్థులు మరింత ప్రతిభావంతులు అయ్యారు. 


నూతన విద్యా విధానానికి అుగుణంగా 14, 255 అంగన్‌వాడీ కేంద్రాలు సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల ఆవరణలోకి తీసుకొచ్చాం. 4,470 ప్రాథమిక పాఠశాలలను ఉ్నత పాఠశాలల ఆవరణలోకి తీసుకొచ్చాం. ఈ విధానంలో సబ్జెక్ట్ ఉపాధ్యాయలను ఏర్పాటు చేశాం. 
జగన్న విద్యా కానుక ద్వారా ఏటా 47 లక్షల మంది పిల్లలకు ప్రయోజం కలిగేలా 3,367 కోట్ల రూపాయల ఖర్చుతో యూనిఫామ్‌లు, బ్యాగ్‌లు, బూట్లు, పాఠ్య పుస్తకాలతో కూడిన కిట్ అందిస్తున్నాం. 55,607 అంగన్‌వాడీ కేంద్రాలకు యాక్టివిటీ ఆధారిత అభ్యాసానికి సంబంధఇంచిన 26 అంశాలతో కూడిన ప్రీ స్కూల్ కిట్‌లు అందజేశాం. 


మన బడి నాడు నేడు పథకం 56, 703 ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్‌ కళాశాలల్లో అభ్యసించే వాతావరణాన్ని మెరుగుపరిచింది. మౌలిక వసతులు కల్పించాం. మొదటి దశలో 15,715 స్కూల్స్‌, రెండో దశలో 22,344 బడులు బాగు కోసం 7,163 కోట్లు ఖర్చు పెట్టాం. 


43 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన అహారాన్ని జగనన్న గోరుముద్ద పథకం ద్వారా అందిస్తున్నాం. దీనికి ఏటా 1910 కోట్లు ఖర్చు పెడుతున్నాం. పోషకాహార లోపం పరిష్కరించేందుకు వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం కింద 35 లక్షల 71 వేల మంది మహిళలు, పిల్లలకు ప్రయోజనం చేకూరుస్తున్నాం. 2019లో ఈ రక్తహీనతతో బాధపడుతున్న వాళ్లు 53.71 శాతం ఉంటే... 2023 నాటికి అది 24.66 శాతానికి తగ్గించాం. ఎదుగుదుల లోపాన్ని ఎదుర్కొంటున్న పిల్లలు శాతం 2019లో 31.2 ఉంటే... ఇప్పుడు అది 6.84 శాతానికి తగ్గింది. 

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజా సమస్యలు పరిష్కారం

గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంతో లీడర్లు నేరుగా వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో 58,288 పనులను 2,356 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మంజూరు చేయగా... ఇప్పటి వరకు 729 కోట్ల రూపాయలతో 17, 239 పనులు పూర్తి అయ్యాయి. 

అన్నింటికీ కుప్పమే ఉదాహరణ: బుగ్గన

ఉన్న వనరులను వినియోగించుకొని గతంలో ఉన్న 13 జిల్లాలను 26కు పెంచుకున్నాం. రెవెన్యూ డివిజన్‌లను 52 నుంచి 77కు పెంచాం. కొత్త ఏర్పాటు చేసిన 25 రెవెన్యూ డివిజన్‌లలో కుప్పం కూడా ఉంది. దీని వల్ల పాలన ప్రజలకు మరింత చేరువైంది. జవాబుదారీతనం పెరిగింది. అవసరమైన చోట్ల కొత్త పోలీస్ సబ్‌డివిజన్‌లను స్టేషన్లను ఏర్పాటు చేశాం. అలా చేసిన వాటిలో కుప్పం పోలీస్‌ సబ్‌డివిజన్‌ను ఆరు పోలీసు స్టేషన్‌ల పరిధితో ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాలో దిశా పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశాం. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాధాన్యత ఉన్న 20 ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లు ప్రారంభించాం. 

గడప వద్దకే సంక్షేమం అందించాం: బుగ్గన

పాలనా వికేంద్రీకరణలో భాగంగా కమ్యూనిటీ కాంట్రాక్టుల విధానం స్థానిక పాలనలో పౌరులకు భాగస్వామ్యం కల్పించాం. చిట్ట చివరి వరకు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశాం.  దాదాపు లక్షా 35 వేల మంది ఉద్యోగులతో 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశాం. 2 లక్షల 66 వేల మంది వాలంటీర్లను నియమించి  అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించాం. పౌర సేవలు గడప వద్దకే చేర్చాం. 

ఏపీ బడ్జెట్ సంక్షేప్త స్వరూపం ఇదే

వార్షిక బడ్జెట్‌- రూ.2లక్షల 86వేల 389కోట్లు
రెవెన్యూ వ్యయం- రూ.2లక్షల 30వేల 110 కోట్లు
మూలధన వ్యయం -రూ.30వేల 530 కోట్లు 
ద్రవ్యలోటు -రూ.55వేల 817కోట్లు 
రెవెన్యూ లోటు -రూ.24వేల 758 కోట్లు 
జీఎస్డీపీలో రెవెన్యూ లోటు -1.56శాతం
జీఎస్డీపీలో ద్రవ్యలోటు -3.51శాతం. 

ఏడు భాగాలుగా పాలనా విధానాలు : బుగ్గన 

ఏడు భాగాలుగా పాలనా విధానాలు : బుగ్గన 
సుపరిపాలన ఆంధ్ర
సామర్థ్య ఆంధ్ర
మన మహిళ, మహారాణుల ఆంధ్ర
అన్నపూర్ణ ఆంధ్ర
సంక్షేమ ఆంధ్ర 
సంపన్న ఆంధ్ర
భూభద్ర ఆంధ్ర

కొత్త పంథాలో పాలన : బుగ్గన

పాలకుడు ప్రజల ఆనందాన్ని శ్రేయస్సును తన శ్రేయస్సు, ఆనందంగా భావించాలి- అదే జగన్ మోహన్ రెడ్డి చేశారు. వినూత్న పరిపాలన ఆవిష్కరణలు చేపట్టాం. విభజన గాయాలతో ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో తీసుకెళ్లేందుకు జగన్ మోహన్ రెడ్డి కృషి చేశారు. 

మాది ప్రజా ప్రభుత్వం : బుగ్గన

అంబేద్కర్‌ ఆశయాలు మా ప్రభుత్వానికి మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి: బుగ్గన 
మాది ప్రజా ప్రభుత్వం. 

అందరికీ ధన్యవాదాలు తెలిపిన బుగ్గన

ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అవకాశం దొరికింది. నాకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు, నాకు సహకరించిన అధికారులకు, ఇతర సహచరులకు ధన్యవాదాలు 

 అసెంబ్లీ నుంచి వరుసగా రెండో రోజూ టీడీపీ సభ్యుల సస్పెన్షన్

 అసెంబ్లీ నుంచి ఒకరోజు పాటు టీడీపీ సభ్యుల సస్పెన్షన్.


 రెడ్ లైన్ దాటి స్పీకర్ పోడియం ఎక్కిన టీడీపీ సభ్యులు.. 


వాయిదా తీర్మానం పై పట్టుబట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు.. 


రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలంటూ నినాదాలు.. 


టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే సభలో పలు బిల్లులకు ఆమోదం.

ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం

ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఏపీ మంత్రిమండలి ఆమోదించింది. అంతకు ముందు బడ్జెట్ ప్రతులను దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ రూపొందించినట్టు తెలిపారు. చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథలా భావించి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగుంటే, కోవిడ్ లేకపోయి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసేవాళ్లమన్నారు. మా ప్రభుత్వ హయాంలో చేయాల్సిన దాని కన్నా అట్టడుగువర్గాలకు ఎక్కువ మేలు చేశామని పేర్కొన్నారు. బతకడం కష్టంగా ఉన్న నిస్సహాయ పేద వర్గాలే మా  ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని వెల్లడించారు. గత ఐదేళ్ల బడ్జెట్ లో విద్య, వైద్యం, మహిళా సాధికారత, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసినట్టు వివరించారు. 

Background

AP Budget 2024 News Live: ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేడు (ఫిబ్రవరి 7) తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉదయం 11 గంటలకు నేడు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు నేడు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన భేటీ అయ్యే ఈ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు. ఉదయం 8 గంటలకు సమయంలో సచివాలయం మొదటి బ్లాక్‌లో ఈ భేటీ జరగనుంది. 


ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఉదయం 9 గంటలకు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.


సోమవారం (ఫిబ్రవరి 5) నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు  ప్రారంభం అయ్యాయి. ఆ రోజు ఉదయం 10 గంటలకు గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఉభయసభలూ మంగళవారానికి వాయిదా పడ్డాయి. 


మంగళవారం ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సుదీర్ఘంగా మాట్లాడారు. గత ప్రభుత్వ విధానాల వల్ల విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి రంగాలు కుదేలయ్యాయని సీఎం జగన్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో చంద్రబాబు రైతులకు రూ.15వేలకోట్లు కూడా ఇవ్వలేదని..  పొదుపు సంఘాల వడ్డీ కూడా మాఫీ చేయలేదన్నారు. ప్రతీ రాష్ట్రానికి ఒక ఎకనామిక్‌ పవర్‌ హౌజ్‌ ఉండాలిఅలాంటి పవర్‌హౌజ్‌ లేకపోతే  రాష్ట్ర ఆదాయాలు ఎప్పటికీ పెరగవన్నారు. ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్‌ను కోల్పోయాం ..  రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతోందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం తగ్గిపోయింది ..అందుకే విశాఖ గురించి పదే పదే చెబుతున్నానన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఎదగడానికి పెద్ద పెద్ద నగరాలు అవసరం .. ఓ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ఉండాలి ఇలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించలేదని వ్యాఖ్యానించారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.