Breaking News Live: విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల మదింపునకు కేంద్రం ఉత్తర్వులు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP Desam Last Updated: 11 Mar 2022 10:43 PM
Background
ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తక్కువ...More
ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తక్కువ ఎత్తులో పొడి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల రెండు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.‘‘ఆంధ్రప్రదేశ్, యానాంలో తక్కువ ఎత్తులో ప్రధానంగా ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా వచ్చే మూడు రోజుల వరకూ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితిని ఇలా ఉండనుంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వచ్చే 3 రోజులు వాతావరణం పొడిగా ఉండనుంది. దక్షిణ కోస్తా, యానాం ప్రాంతాల్లో నూ వాతావరణ పొడిగానే ఉండనుంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగా ఉంటుంది. వర్షాలకు సంబంధించిన గానీ, ఎండలకు సంబంధించిన గానీ ఎలాంటి హెచ్చరికలూ లేవు’’ అని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు.‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తూర్పు తెలంగాణ రాష్ట్రంలోని చాలా భాగాల్లో ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలోని జగ్గంపేట - తాడేపల్లిగూడం పరిధిలో, తెలంగాణ భద్రాచలం, సూర్యాపేట, ఖమ్మంలో ఎండల తీవ్రత విపరీతంగా ఉంది. ఈ ఎండల తీవ్రత ఉండగా, మనం నీటిని తాగడం చాలా మంచిది. మార్చి 13 నుంచి ఎండలు మరింత ఎక్కువ అవుతాయి.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.తెలంగాణలో ఇలా.. (Telangana Weather Update)తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడం జిల్లాల్లో ఎండ వేడి ఎక్కువగా ఉండనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మార్చి 13 నుంచి వడగాల్పులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగ్నేయ దిశ నుంచి గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 33, 34 డిగ్రీల మేర నమోదు అవుతున్నాయి.బంగారం, వెండి ధరలుతెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) బాగా తగ్గింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ ఎత్తున పెరుగుతున్న సంగతి తెలిసిందే. వెండి ధర కూడా నేడు బాగా తగ్గింది. కిలోకు ఏకంగా రూ.2,600 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్లో రూ.48,200 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,580 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.74,100 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,580గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.76,700 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర అంతే పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.48,200 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,580గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.74,100 గా ఉంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల మదింపునకు కేంద్రం ఉత్తర్వులు
విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల మదింపు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు ఆహ్వానించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం ఒక్కొ అడుగు ముందుకెస్తుంది. ఉక్కు కర్మాగారం ఆస్తుల విలువ కట్టడానికి ప్రతిపాదనలకు ఆహ్వానం పలుకుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ఆర్ధిక శాఖ.