BJP Vishnuvardhan Reddy :   2024లో బిజెపి 350 సీట్లు పైన గెలవనున్నది మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. పుట్టపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.  ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ అన్నారు. 


ఏపీలో క్రియాశీలక రాజకీయ పార్టీగా బీజేపీ                              


రాబోయే ఎన్నికల్లో బిజెపి ఆంధ్ర రాష్ట్ర క్రియాశీలక రాజకీయ పార్టీగా ఆవిర్భావం చెందబోతుందని విష్ణువర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  2024 లో వైసీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.  ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు అన్న నమ్మకంతోనే సీఎం వారిని మారుస్తున్నారని..  బిజెపి పై ప్రజల్లో మరింత నమ్మకం ఏర్పడింది అనడానికి నిదర్శనం ఇటీవల జరగిన ఎన్నికలేనన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిందని..   తెలంగాణలో అనూహ్యమైన ఓటు శాతం పెరిగిందన్నారు. 


వికసిత్ భారత్ సంకల్పాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఏపీ ప్రభుత్వం                       


వికసిత్ భారత్ అన్నది దేశవ్యాప్తంగా ప్రజలకు పలు సేవలు అందించడానికి అవగాహన కల్పించడానికి చేపట్టిన యాత్ర అని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.   ఐఏఎస్ అధికారులు కొందరు అయ్యా ఎస్ పద్దతులలో కోందరు  ప్రవర్తిస్తున్నారని..   వీరి పైన త్వరలోనే గవర్నర్ కి ఫిర్యాదు చేయబోతున్నామని విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు.  కేంద్ర ప్రభుత్వ పథకాలు వినియోగం చేసుకోని రాష్ట్ర ప్రజలకు చేరవేయడంలో సైతం విఫలమవుతున్న ప్రభుత్వం ... తప్పులు కప్పి పుచ్చుకునేందుకు  మరిన్ని తప్పులు చేస్తోందన్నారు. 


కుటుంబస వారసత్వ పాలనకు  చరమ గీతం                       


రాబోయే ఎన్నికల్లో కుటుంబ పాలన వారసత్వ పాలనకు చరమగీతం. పాడాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని  విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.  జనసేన బిజెపి తెలంగాణలో కలిసి పోటీ చేశాయి . ఆంధ్రాలో కూడా అదే జరుగుతుందన్నారు.  మేము సీట్లు ఇచ్చే వాళ్ళమే తప్ప తీసుకునే వాళ్ళం కాదని..  గత 4 సంవత్సరాలల్లో అన్ని ఎన్నికలలో బిజెపి గట్టి పోటీగా నిలబడుతూ వస్తోందన్నారు.  పెద్ద పార్టీలు అంటూ చెప్పుకుంటున్న పార్టీలు సైతం ఎన్నికలలో తమ అభ్యర్థులను నిలుపుకోవడంలో విఫలమయ్యాయన్నారు.   బిజెపి ఆంధ్రలో ఎదుగుతున్న దానికి నిదర్శనం ఇంతకన్నా ఏంకావాలని ప్రశ్నించారు.   రాష్ట్ర ప్రజలు,  దేశ ప్రజలు బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని కోన్ని పార్టీలు స్వార్థంతో  లేపాలని చూస్తున్నారుని..  వాళ్లకు అది   రాజకీయ ఆత్మహత్య సదృశ్యమేనని హెచ్చరించారు.  ఆ పార్టీలకు బీజేపీ పార్టీ భవిష్యత్ లో సరైన  సమాధానం చెబుతుందన్నారు.