Breaking News Live: గుంటూరులో విషాదం - మట్టిపెళ్లలు విరిగిపడి ఒకరు మృతి, నలుగురికి గాయాలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 16 Mar 2022 11:57 AM

Background

ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న బలమైన వేడిగాలుల వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం పొడిగా మారింది. ఈ రోజు ఎండల తీవ్రత మరింత ఎక్కువైంది. ఉష్ణోగ్రతలు ఇప్పుడు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదు కానుంది. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో...More

Gujrat Drugs: ముంద్రాపోర్టు డ్రగ్స్ కేసులో కీలక వివరాలు బయటికి

గుజరాత్‌లోని ముంద్రాపోర్టులో కొద్ది నెలల క్రితం బయటపడిన డ్రగ్స్ వ్యవహారంలో కీలక వివరాలు వెలుగు చూశాయి. రూ.3 వేల కోట్ల డ్రగ్స్ కేసులో తాజాగా NIA ఛార్జిషీట్ దాఖలు చేసింది. విజయవాడకు ఈ దందాతో లింకులు ఉండగా.. ఆషీ ట్రేడింగ్ పేరుతో డ్రగ్స్ వ్యాపారం సాగింది. ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక వివరాలు వెల్లడించింది. ఈ కేసులో మాచవరం సుధాకర్‌, తన భార్య వైశాలితో పాటు అఫ్గానిస్థాన్‌కు చెందిన పెడ్లర్ సూత్రధారులు అని గుర్తించారు. మాచవరం సుధాకర్‌కు చెందిన ఆషీ ట్రేడింగ్‌తో డ్రగ్స్ దిగుమతి చేసుకునే వారు. టాల్కమ్ పౌడర్ పేరుతో డ్రగ్స్‌ను తెప్పించారు. తమిళనాడు, గుజరాత్, చెన్నై, ఢిల్లీకి చెందిన డ్రగ్స్ పెడ్లర్స్‌పై ఎన్ఐఏ అభియోగాలు మోపింది. ఇప్పటి వరకూ ఈ కేసులో 10 మంది అరెస్టు చేసినట్లుగా NIA వెల్లడించింది. ఆఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మీదుగా ఈ సరఫరా జరిగేదని ఎన్ఐఏ గుర్తించింది. అఫ్గానిస్థాన్‌కు చెందిన హాసన్ డాడీ కీలక సూత్రదారి అని ఎన్ఐఏ వెల్లడించింది. ఈ కేసులో మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. హవాలా ద్వారా డబ్బులు మార్చినట్లుగా గుర్తించారు.