Chandrababu: వెక్కి వెక్కి ఏడ్చేసిన చంద్రబాబు.. తీవ్ర భావోద్వేగంతో ప్రెస్ మీట్

కేంద్ర ప్రభుత్వం 3 సాగు చట్టాలపై వెనక్కి తగ్గినట్లుగానే.. ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల అంశాన్ని ఉపసంహరించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

ABP Desam Last Updated: 19 Nov 2021 01:58 PM

Background

కేంద్ర ప్రభుత్వం 3 సాగు చట్టాలపై వెనక్కి తగ్గినట్లుగానే.. ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల అంశాన్ని ఉపసంహరించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. సీఎంగానే తాను సభలో అడుగుపెడతానని ప్రతిపక్ష నేత...More

మా అమ్మ, సోదరి, బాబాయ్ గురించి చంద్రబాబు మాట్లాడారు: జగన్

ప్రతిపక్షనేత చంద్రబాబుకు తన రాజకీయ అజెండానే ముఖ్యమని, ప్రజల ఎలా పోయినా పట్టించుకోరని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండోరోజు సభ వాడీవేడిగా సాగింది. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని, హైడ్రామా చేస్తున్నారని.. సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని చెప్పారు. మా అమ్మ, సోదరి, బాబాయ్‌ గురించి చంద్రబాబే మాట్లాడారని సభలో ప్రస్తావించారు. కుప్పం ప్రజలు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓట్లు వేశారని ఏపీ ప్రజలకు తెలుసునని, విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తమని ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.