= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
మా అమ్మ, సోదరి, బాబాయ్ గురించి చంద్రబాబు మాట్లాడారు: జగన్ ప్రతిపక్షనేత చంద్రబాబుకు తన రాజకీయ అజెండానే ముఖ్యమని, ప్రజల ఎలా పోయినా పట్టించుకోరని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండోరోజు సభ వాడీవేడిగా సాగింది. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, హైడ్రామా చేస్తున్నారని.. సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని చెప్పారు. మా అమ్మ, సోదరి, బాబాయ్ గురించి చంద్రబాబే మాట్లాడారని సభలో ప్రస్తావించారు. కుప్పం ప్రజలు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓట్లు వేశారని ఏపీ ప్రజలకు తెలుసునని, విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తమని ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఒక కన్ను ఇంకో కన్నును ఎలా పొడుచుకుంటుంది?: జగన్ ‘‘వైఎస్ వివేకానంద రెడ్డి నాకు చిన్నాన్న.. చంద్రబాబుకు కాదు.. వైఎస్ అవినాశ్ రెడ్డి కూడా నా ఇంకో చిన్నాన్న కొడుకు.. నాకు సోదరుడే. అలాంటిది వివేకా హత్య కేసులో ఆయన పాత్ర ఎలా ఉంటుంది. ఒక కన్ను ఇంకో కన్నును ఎలా పొడుచుకుంటుంది? వివేకా హత్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే జరిగింది. మా చిన్నాన్న వివేకాను వాళ్లే ఏమైనా చేసుండాలి. చంద్రబాబు మా కుటుంబాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్రస్టేషన్లో ఏదోదో మాట్లాడుతున్నారు.. శపథాలు చేసి అసెంబ్లీలోకి రాబోమని తేల్చి చెప్పి వెళ్లిపోయారు’’ అని సీఎం జగన్ అసెంబ్లీలో అన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ప్రెస్ మీట్లో వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ శాసన సభలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సభలో తన భార్య భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సభలో అధికార పక్షం చేసిన తీరు పట్ల ఆవేదన చెందుతూ వెక్కి వెక్కి ఏడ్చారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
వ్యక్తిగతంగా దూషించారని చంద్రబాబు ఆవేదన సీనియర్ నేతను, పలుమార్లు సీఎంగా చేసిన వ్యక్తిని అయినప్పటికీ తనను వ్యక్తిగతంగా దూషించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా భరించానని.. కానీ తన భార్యపై సైతం వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి సభలో తాను ఉండలేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై అధికార పార్టీ ఫోకస్ చేస్తే అందరికీ ప్రయోజనకరమని వ్యాఖ్యానించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
సీఎంగానే ఏపీ అసెంబ్లీలో మళ్లీ కాలుపెడతా: చంద్రబాబు రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. సీఎంగానే తాను సభలో అడుగుపెడతానని ప్రతిపక్ష నేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. గతంలో ఎన్నో సభలు, సమావేశాలలో పాల్గొన్నాను కానీ ఇలాంటి అవమానం ఎప్పుడూ ఎదుర్కొలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.