= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
లఖింపుర్ ఖేరి ఘటన.. కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ నిరాకరణ యూపీలోని లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటన కేసులో విచారణ కొనసాగుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేసింది. ప్రధాన నిందితుడు, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్ను జిల్లా కోర్టు కొట్టివేసింది. ఆశిష్ మిశ్రాకు జిల్లా కోర్టు బెయిల్ నిరాకరించింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థతకు లోనయ్యారు. ఆయనను చికిత్స నిమిత్తం ఢిల్లీలో ఎయిమ్స్కు తరలించారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
చిత్తూరు జిల్లాలో దారుణం.. బొప్పాయి తోటలో బాలుడి డెడ్ బాడీ.. చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ల బాలుడి హత్య కలకలం రేపుతోంది. నిన్న కిడ్నాప్ అయిన తేజేష్ అనే బాలుడు దారుణహత్యకు గురయ్యాడు. బొప్పాయి తోటలో బాలుడి డెడ్ బాడీని గుర్తించారు. బాలుడి తల్లిదండ్రులు ప్రస్తుతం కువైట్ లో ఉంటున్నారు. పండుగకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన తేజేష్ హత్యకు గురికావడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
బద్వేల్ ఉప ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ తుది గడువు నేటి మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. చివరిరోజైన బుధవారం నాడు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. బద్వేల్ ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
హుజూరాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు.. చివరిరోజు 12 నామినేషన్లు విత్డ్రా హుజూరాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ తుది గడువు నేటి మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. చివరిరోజైన బుధవారం నాడు మొదట ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. చివరి క్షంలో మరో ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అందులో బీజేపీ నుంచి ఈటల జమున, కాంగ్రెస్ నుంచి లింగారెడ్డి, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు సుమన్ నాయక్, వినోద్ కుమార్, రాజ్ కుమార్, నూర్జహాన్ బేగం, మల్లికార్జున్ తదితరులు పోటీ నుంచి తప్పుకున్నారు. రెండు ఈవీఎంలతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ తరువాత హుజూరాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
మంత్రి కేటీఆర్తో డీఎంకే ఎంపీల భేటీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్తో డీఎంకే నేతలు బుధవారం ఉదయం భేటీ అయ్యారు. నీట్ రద్దు చేయాలనే డిమాండ్కు మద్దతు ఇవ్వాలని పలువురు ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. ఇదే అంశంపై కేటీఆర్తో డీఎంకే ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్ రాసిన లేఖను కేటీఆర్కు డీఎంకేకి చెందిన ఇద్దరు ఎంపీలు అందజేశారు. నీట్ ప్రవేశ పరీక్షను వ్యతిరేకిస్తూ 12 మంది సీఎంలకు స్టాలిన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
భారీగా బంగారు ఆభరణాల పట్టివేత ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బి. కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా బంగారం పట్టుబడింది. వంకమరి చెక్పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఈ బంగారాన్ని సీజ్ చేశారు. బద్వేల్ ఉపఎన్నికల నేపథ్యంలో పోలీసులు సోమవారం అర్ధరాత్రి ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే ప్రొద్దుటూరు నుంచి గుంటూరు జిల్లా నరసరావుపేట వెళ్తున్న ఓ కారులో రూ. 75 లక్షలు విలువ చేసే బంగారు అభరణాలు పట్టుబడ్డాయి.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
డీసీఎం-ఆటో ఢీ.. ఒకరు మృతి డీసీఎంను ఆటో ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. సురేష్, స్వప్న అనే భార్యాభర్తలు సోమవారం ఉదయం సికింద్రాబాద్ నుంచి బాలానగర్కు ఆటోలో వెళ్తున్న సందర్భంలో.. బల్కంపేట రైల్వే బ్రిడ్జి కింద మలుపులో ప్రమాదం జరిగింది. డీసీఎం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న ఆటో డీసీఎంను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జయింది. ఆటోలో ఉన్న స్వప్న, సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు అంబులెన్స్లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు.