Breaking News Live: దక్షిణాఫ్రికాలో కరోనావైరస్ కొత్త వేరియంట్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP Desam Last Updated: 25 Nov 2021 05:44 PM
Background
విశాఖ: ఎండాడ వద్ద ఘోర ప్రమాదంలో సీఐ దుర్మరణంగురువారం తెల్లవారుజామున విధులు ముగించుకుని మధురవాడ వైపు వెళ్తున్న పోలీసు వాహనం ఎండాడ ఏసీపీ కార్యాలయం దగ్గరలో ప్రమాదానికి గురైంది. బహుశా ఈ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టి ఉంటుందని, లేదా...More
విశాఖ: ఎండాడ వద్ద ఘోర ప్రమాదంలో సీఐ దుర్మరణంగురువారం తెల్లవారుజామున విధులు ముగించుకుని మధురవాడ వైపు వెళ్తున్న పోలీసు వాహనం ఎండాడ ఏసీపీ కార్యాలయం దగ్గరలో ప్రమాదానికి గురైంది. బహుశా ఈ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టి ఉంటుందని, లేదా ఈ వాహన డ్రైవర్ (హోమ్ గార్డు) వేరే వాహనాన్ని ఢీకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో 3 టౌన్ సీఐ ఈశ్వరరావుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్కి గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. పీఎం పాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.పెట్రోల్ డీజిల్ ధరలు..హైదరాబాద్లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్లోనూ నాలుగు రోజులుగా స్థిరమైన ధరలే ఉంటున్నాయి. కానీ, తాజాగా పెరిగాయి. పెట్రోల్ ధర రూ.0.19 పైసలు పెరిగి రూ.107.88 అయింది. డీజిల్ ధర కూడా రూ.0.17 పైసలు పెరిగి రూ.94.31 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. విజయవాడ మార్కెట్లో పెట్రోల్ ధర నేడు కాస్త ఎక్కువగానే పెరిగింది. లీటరుకు రూ.0.90 పైసలు పెరిగి ప్రస్తుతం రూ.110.98 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.81 పైసలు పెరిగి రూ.97.00గా ఉంది.బంగారం ధరలు..2 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో రూ.44,700 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,760 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.67,600గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. ఇక విజయవాడలోనూ పసిడి ధర స్థిరంగా కొనసాగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,700 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,760గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,600గా ఉంది. ఇక విశాఖపట్నం మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,700 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,760గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.67,600 గా ఉంది.Also Read: Tomato Rates: సెంచరీ దాటిన టమాటా ధరలు...మరి ప్రత్యామ్నాయంగా ఏం తినాలంటే...Also Read: ఖమ్మంలో వామపక్షాలతో టీఆర్ఎస్ దోస్తీ.. కాంగ్రెస్కు చెక్ పెట్టేందుకు ప్లాన్ !ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
దక్షిణాఫ్రికాలో కోవిడ్-19 కొత్త వేరియంట్
దక్షిణాఫ్రికాలోని శాస్త్రవేత్తలు కరోనావైరస్ కొత్త వేరియంట్ను కనుగొన్నారని వార్తా సంస్థ AFP ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొంది.