= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
నెల్లూరు జిల్లా కోవూరులో భారీ పేలుడు.. నెల్లూరు జిల్లా కోవూరులో భారీ పేలుడు సంభవించింది. రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు ఉలిక్కిపడ్డారు. బాంబు పేలిందా లేక, గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయిందా, లేదా ఇంకేదైనా కారణం ఉందా అని ఆందోళనకు గురయ్యారు. పేలుడు తర్వాత కరెంటు పోవడంతో చుట్టూ చీకట్లు అలముకున్నాయి. దీంతో జనం భయాందోళనలకు గురయ్యారు. కోవూరు శ్మశానవాటిక సమీపంలోని బస్ షెల్టర్ లో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలినట్టు స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. బస్ షెల్టర్ కూడా కుప్పకూలింది. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం కోవూరు ఎస్సై వెంకటేశ్వరరావు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సోమశిల ప్రాజెక్ట్ కి గండిపడిందనే పుకారుతో ముందురోజు జనం అనవసరపు ఆందోళనకు గురికాగా.. ఇప్పుడు అదే ప్రాంతంలోని ప్రజలు పేలుడు ధాటికి ఉలిక్కిపడ్డారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
శ్రీశైలం హుండీ లెక్కింపు ఆదాయం రూ.3.56 కోట్లు కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మహాక్షేత్రంలో స్వామి అమ్మవార్ల హుండీల ద్వారా 3 కోట్ల 56 లక్షల 20 వేల 325 రూపాయల నగదు వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు ఉభయదేవాలయాల హుండీల లెక్కింపు ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్టమైన భద్రత సీసీ కెమెరాల మధ్య ఆలయ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించామని ఈవో తెలిపారు. నగదుతోపాటు 1435 యూఎస్ డాలర్లు, 70 కెనడా డాలర్లు, 2 సింగపూర్ డాలర్లు స్వామి అమ్మవార్లకు భక్తులు సమర్పించినట్లు ఈవో లవన్న వెల్లడించారు
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
బయ్యారంలో పులి సంచరిస్తుందని గ్రామస్తుల ఆందోళన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఇసుకమేది, భీమ్లా తండా సమీపంలో పులి సంచరిస్తుందని గ్రామస్తుల ఆందోళన చెందుతున్నారు. పులి సంచారంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. బయ్యారంలోని వివిధ గ్రామాల్లో పంట పొలాల వద్దకు వెళ్లకుండా రైతులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. పులి ఆనవాళ్ల కోసం అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు. ఇటీవల ములుగు జిల్లా అడవుల్లో పులిని వేటగాళ్లు చంపినట్లు తెలుస్తోంది. వేటగాళ్ల కదలికలపై అటవీ అధికారులు దృష్టిపెట్టారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఎన్నిక ఏకగ్రీవం నిజామాబాద్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి భారీగా ఓట్లు ఉండడంతో కాంగ్రెస్, బీజేపీ బరిలో నుంచి తప్పుకున్నాయి. దీంతో కల్వకుంట్ల కవిత ఒక్కరే బరిలో ఉన్నారు. ఫలితంగా ఆమె ఎన్నిక ఏకగ్రీవం అయింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ప్రధానికి లేఖ రాసిన- సీఎం జగన్ ఏపీలో వరద నష్టంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక టీమ్ను పంపాలని కోరారు. తక్షణ వరద సాయం కింద రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని లేఖలో రాశారు. ఈ లేఖను ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కూడా పంపారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ముఖ్యమంత్రి జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. ‘‘సర్పంచులకు నిధులు, విధులు లేకుండా పంచాయతీల అభివృద్ధి ఎలా సాధ్యం? కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 14, 15 ఆర్థిక సంఘాల నిధులతో పాటు సాధారణ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం సరికాదు. సర్పంచులకు అధికారాలు లేకుండా చేయడమే మీరు చెబుతున్న అధికార వికేంద్రీకరణా? పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని ఏపీలోని సర్పంచులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పంచాయతీల నిధులు రూ.3,450 కోట్లను తిరిగి ఇవ్వాలి.’’ అని రామకృష్ణ డిమాండ్ చేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఢిల్లీలో డ్రామా ఓ వైపు రాష్ట్రంలో వర్షాలకు వడ్లు పాడయిపోయి, మొలకెత్తుతుంటే.. కేసీఆర్ అండ్ బ్యాచ్ మాత్రం ఢిల్లీలో డ్రామాలాడుతున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. రైతుల పేరుతో రాజకీయాలు చేస్తూ.. రైతు ప్రభుత్వమని చెప్పుకోడానికి సిగ్గుండాలని ఆమె ట్విటర్ ద్వారా విమర్శించారు.