Breaking News Live: బీజేపీ శాంతి ర్యాలీకి పోలీసుల అనుమతి... హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డా
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP Desam Last Updated: 04 Jan 2022 05:47 PM
Background
సంగారెడ్డిలో ప్రమాదంసంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం, నందిగామ గ్రామ పరిధిలోని సవారియా అనే పైపుల తయారీ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఇనుప రాడ్లను క్రేన్ సహాయంతో తీసుకువెళ్తుండగా బరువు ఎక్కువై తీగ తెగి నలుగురు కార్మికులపై పడింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రేమ్...More
సంగారెడ్డిలో ప్రమాదంసంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం, నందిగామ గ్రామ పరిధిలోని సవారియా అనే పైపుల తయారీ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఇనుప రాడ్లను క్రేన్ సహాయంతో తీసుకువెళ్తుండగా బరువు ఎక్కువై తీగ తెగి నలుగురు కార్మికులపై పడింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రేమ్ కుమార్, పాజ్థార్లు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు జితేంద్ర కుమార్, ఆనంద్ కుమార్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న భానూరు పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.కరోనా కేసులుతెలంగాణ వ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 482 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 397 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. డిసెంబర్ మూడో వారం వరకు రోజుకు సగటున 100 లోపు కేసులు నమోదు కాగా, నాలుగో వారంలో క్రిస్మస్ వేడుకలు, డిసెంబర్ 31 తర్వాత వైరస్ మరింత వేగంగా వ్యాపించింది. గతంలో ఎన్నడూ లేనంతగా కరోనా కేసులు పెరుగుతుండటంతో విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలువైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నిత్యం కుట్రలు కుతంత్రాలు చేస్తుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. ఏనాడూ సింగిల్ గా ఎన్నికలు వెళ్లి గెలిచిన చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు. మామకు వెన్నుపొటు పొడిచి ఓసారి, వాజిపేయ్ మొహాంతో మరోసారి, మోదీ పేస్ తో ఇంకొసారి బాబు గెలిచారని ఆరోపించారు. మహిళల సహాకారంతో మళ్లీ అధికారంలోకి వస్తామని ధర్మాన ధీమా వ్యక్తం చేశారు. జగన్ మళ్లీ అధికారం చేపట్టకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఒక్కరే నాయకుడు.. అది జగన్ మాత్రమే అని మంత్రి ధర్మాన అన్నారు. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో అత్యధిక మేజార్టీలతో గెలుపొందామని తెలిపారు.వైసీపీలో ఒక్కరే లీడర్ అది జగన్రాష్ట్రంలో టీడీపీ లేదని, అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సీఎం జగన్ ను రక్షించుకునేందుకు ప్రాణం ఇచ్చే నాయకులు ఉన్నారన్నారు. ప్రజలకు అభివృద్ది చేస్తుంటే టీడీపీ నేతలకు వచ్చిన ఇబ్బందేంటని ఆయన ప్రశ్నించారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు వైసీపీ ప్రభుత్వం కృషిచేస్తుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వైసీపీలో లీడర్ ఒక్కరే అది జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందన్నారు. రెవెన్యూ మంత్రిగా ముప్పై లక్షల మందికి ఇల్లు ఇచ్చే అవకాశం తనకు లభించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
బీజేపీ శాంతి ర్యాలీకి పోలీసుల అనుమతి... హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డా
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. జేపీ నడ్డాకు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. జాయింట్ సీపీ కార్తికేయ నడ్డాతో మాట్లాడారు. కరోనా ఆంక్షలను వివరించారు. బీజేపీ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చారు. కేవలం 40 మందితో ర్యాలీకి అనుమతి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. సికింద్రబాద్ గాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ వరకు బీజేపీ శాంతి ర్యాలీ చేయనుంది.