= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
బద్వేలులో జనసేన పోటీ చేయడం లేదు : పవన్
కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. దివంగత ఎమ్మెల్యే భార్యకే టికెట్ ఇచ్చినందున జనసేన పోటీ చేయడం లేదని తెలిపారు. బద్వేలు జనసేన నేతలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఎన్నిక ఏకగ్రీవం చేసుకోవాలని వైసీపీకి సూచించారు. బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక ఈనెల 30న జరగనుంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఐసీయూలో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి.. ! తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు నిరాకరించినప్పటికీ కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీగా వచ్చి ఎల్బీ నగర్ లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు లాఠీఛార్జ్ చేసినట్లు కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ లాఠీఛార్జ్ లో హుజూరాబాద్ అభ్యర్థి, NSUI ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ తీవ్ర గాయలై అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి. దీంతో హుటాహుటిన వెంకట్ ను కొత్తపేట ఓమ్ని ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
హుజూరాబాద్ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు తెలంగాణ హుజూరాబాద్ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేసింది. బల్మూరి వెంకట్ పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. సుదీర్ఘ మంతనాల తర్వాత ఏఐసీసీ వెంకట్ పేరును ఫైనల్ చేసింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఎల్బీ నగర్ కూడలిలో కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యయత్నం ఎల్బీనగర్ కూడలిలో కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పెట్రోల్ పోసుకుని విద్యార్థి కల్యాణ్ ఆత్యహత్యకు యత్నించారు. కల్యాణ్ను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాంత్చారి విగ్రహానికి నివాళి అర్పించేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేశారు. కాంగ్రెస్ విద్యార్థి, నిరుద్యోగి జంగ్ సైరన్ చేపట్టింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్ విద్యాశాఖ కమిషనర్గా ఎం.వి.శేషగిరిరావు, స్టాపులు, రిజిస్ట్రేషన్లశాఖ కమిషనర్గా వి.రామకృష్ణ, గ్రామ, వార్డు సచివాలయాల జేసీగా శ్రీధర్ చామకూరి, శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పీవోగా బి.నవ్య, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా ఎస్.భార్గవి నియమితులయ్యారు. బదిలీలు, నియామక ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ జారీ చేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
నాగచైతన్య, సమంత విడాకులు అక్కినేని నాగచైతన్య, సమంత దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. నాగ చైతన్య ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని ప్రకటించారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరు విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారిద్దరూ ప్రకటించారు. ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు సమంత తెలిపారు. ఈ విషయాన్ని సమంత ఇస్టాగ్రామ్ లో ఈ విషయాన్ని తెలిపింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ జంగ్ సైరన్ ర్యాలీకి అనుమతి లేదు: రాచకొండ సీపీ తెలంగాణలో నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో నేడు కాంగ్రెస్ చేపడుతున్న నిరసన ర్యాలీకి అనుమతి లేదని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం దిల్సుఖ్నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే జంగ్ సైరన్ ర్యాలీకి అనుమతి లేదని వెల్లడించారు. విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు జంగ్ సైరన్ ర్యాలీకి పిలుపునిచ్చారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
హుజూరాబాద్ నియోజకవర్గంలో బతుకమ్మ చీరలు పంపిణీకి బ్రేక్ హుజూరాబాద్ నియోజకవర్గంలో బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడింది. కరీంనగర్, హన్మకొండ రెండు జిల్లాలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయద్దని ఈసీ వెల్లడించింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక కారణంగా ఈ రెండు జిల్లాల్లో బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్ వేసింది. ఎన్నికల కోడ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఉప ఎన్నిక జరుగుతున్న హుజూరాబాద్ నియోజకవర్గం కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. దీంతో రెండు జిల్లాల మహిళలకు ఈసారి పండగకు చీరలు అందడం లేదు. వారికి ఎన్నికల తర్వాత ఈ చీరలను పంపిణీ చేసే అవకాశముంది. ఈ రెండు జిల్లాలకు కాకుండా మిగిలిని 31 జిల్లాల్లో యథావిధిగా బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతుంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
నవోదయలో 21 మంది విద్యార్థులకు కొవిడ్ తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయలో 21 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని అధికారులు చెప్పారు. మరో 80 మంది విద్యార్థుల నమూనాలను సేకరించి నిర్ధారణ పరీక్షలకు పంపించామన్నారు. రెండ్రోజుల్లో ఫలితాలు వెల్లడవుతాయన్నారు. 21 మందిని వేరుగా ఉంచి విద్యాలయ ఆవరణను శానిటైజ్ చేయించినట్లు తెలిపారు.