AP Telangana Rain Live Updates : కవరేజ్ కు వెళ్తూ వరదలో గల్లంతైన ప్రముఖ న్యూస్ ఛానల్ రిపోర్టర్ 

Andhra Pradesh - Telangana Rain Live Updates ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలపై తాజా వార్తలకు ఈ పేజీని చూడండి.

ABP Desam Last Updated: 12 Jul 2022 10:45 PM

Background

పీ, తెలంగాణలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. వచ్చే మూడు రోజులు అతి భారీ వర్షాలు పడనున్నట్లుగా భారత వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు.  మరో మూడు నాలుగు రోజుల పాటు వానలు భారీగా పడనున్నట్లుగా హైదరాబాద్, అమరావతిలోని...More

కవరేజ్ కు వెళ్తూ వరదలో గల్లంతైన ప్రముఖ న్యూస్ ఛానల్ రిపోర్టర్ 

జగిత్యాల జిల్లాలో అపశృతి చోటుచేసుకుంది. కవరేజ్ కి వెళ్తూ ప్రముఖ ఛానల్ రిపోర్టర్ వరదలో గల్లంతయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయినా ఇంకా అతని ఆచూకీ లభ్యం కాలేదు.  ప్రైవేటు వ్యవసాయ క్షేత్రంలో వరదలో చిక్కుకున్న వారి న్యూస్ కవరేజ్ కి వెళుతుండగా ఓ ప్రముఖ ఛానల్ కు చెందిన జర్నలిస్టు వరద నీటిలో గల్లంతయ్యారు. సహాయక బృందాలు కూలీలను సురక్షితంగా తరలిస్తున్నారనే వార్త తెలిసిన రిపోర్టర్ జమీర్ అక్కడికి తన సహచర మిత్రుడితో కలిసి షిఫ్ట్ కార్ లో వెళ్లారు. రాయికల్ మండలం రామోజీ పేట భూపతిపూర్ గ్రామాల మధ్యన ఉన్న కల్వర్టు పై వరద నీరు ఉద్ధృతంగా వస్తున్న సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారు నీటిలో కొట్టుకుపోయింది. అయితే కారులో ఉన్న మరో వ్యక్తి తప్పించుకోగలిగారు. అతను స్థానికులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.