Breaking News Live Updates : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ‌మ్యాచ్ ఫిక్సింగ్: ఎమ్మెల్సీ కవిత

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 21 May 2022 07:21 PM
Guntur Crime: గుంటూరు పెదపలకలురులోని ఓ కాలేజ్ పై నుండి దూకిన యువతి

గుంటూరు పెదపలకలురులోని ఓ కాలేజ్ పై నుండి దూకిన యువతి. 
యువతికి స్వల్ప గాయాలు, జి.జి.హెచ్ కి తరలింపు
డిగ్రీ పరీక్ష రాసేందుకు వచ్చిన యువతి.
గత కొంతకాలంగా యువకుడితో ప్రేమలో ఉన్న యువతి.
ప్రేమ వివాహాన్ని ఒప్పుకోరన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్న పోలీసులు

Fuel Price: వాహనదారులకు శుభవార్త.. పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గించిన కేంద్ర ప్రభుత్వం

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గించింది. పెట్రోల్ పై రూ.9.5, డీజిల్ లీటర్ పై రూ.7 మేర తగ్గాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ పై రూ.8 తగ్గించగా, డీజిల్ పై రూ.7 మేర తగ్గించినట్లు తెలిపారు.





KCR Delhi Tour: సర్వోదయ స్కూల్‌ను సందర్శిస్తున్న కేసీఆర్, కేజ్రీవాల్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి సర్వోదయ స్కూల్ ను సందర్శిస్తున్నారు. పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న సిఎం కెసిఆర్ బృందానికి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సాదర స్వాగతం పలికారు. అనంతరం అక్కడి సమావేశ మందిరంలో విద్యాభివృద్ధి పై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను సిఎం కెసిఆర్ తిలకిస్తున్నారు. ఢిల్లీలో విద్యాభివృద్ధి దిశగా కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను, స్కూల్ కరికులమ్ లను, అక్కడి అధికారులు సహా ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ సిఎం కెసీఆర్ కు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో.. ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, జోగినపల్లి  సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, మంత్రి వేముల ఫ్రశాంత్రెడ్డి ఎమ్మెల్యే డా.మెతుకు ఆనంద్ తదితరలు పాల్గొన్నారు

MLC Kavitha: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ‌మ్యాచ్ ఫిక్సింగ్: ఎమ్మెల్సీ కవిత

జగిత్యాల మార్కెట్ :  తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ‌మ్యాచ్ ఫిక్సింగ్ అని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కాంగ్రెసోళ్లు రైతు రచ్చబండ పేరుతో గ్రామాలకు వస్తే ప్రకృతివనాలు, డంప్‌యార్డులు, శ్మశాన వాటికలు చూపించాలన్నారు. వరంగల్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ డ్రామాలు, అందులో పొందుపరిచిన అంశాలను వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో అమలు చేశారో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో అమలు చేయలేనివి తెలంగాణ లో అమలు చేస్తామంటూ చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి బీజేపీని ఎందుకు విమర్శించరు, పసుపు బోర్డు, ధరల పెరుగుదలపై ఎందుకు విమర్శించరు, ఇరు పార్టీల మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందన్నారు. రైతుల ఖాతాల్లోకి నేరుగా 50 వేల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీది. దేశంలో ఎక్కడైనా ఇంత పెద్ద మొత్తంలో రైతులకు అందించారా అని ప్రశ్నించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్, బీజేపీలకు లేనే లేదన్నారు.

కాకినాడ జీజీహెచ్‌ వద్ద ఉద్రిక్తత

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్‌ వద్ద డ్రైవ‌ర్‌గా ప‌నిచేసే కాకినాడకు చెందిన వీధి సుబ్రహ్మణ్యం అనుమానాస్ప‌ద స్థితి నేపథ్యంలో కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సుబ్రహ్మణ్యం మృత‌దేహానికి కాకినాడ జీజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వ‌హిస్తున్నారని.. టీడీపీ నిజ‌నిర్ధార‌ణ బృందం శనివారం ఆసుపత్రికి వెళ్లింది. టీడీపీ నేతలను ఆసుపత్రిలోకి రానివ్వకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే సుబ్రహ్మణ్యం మృతిపై నిజనిజాలు తేలే వరకు పోరాటం కొనసాగుతుందని చెబుతోన్న టీడీపీ నేతలు బారీకేడ్లను తోసుకుంటూ కాకినాడ జీజీహెచ్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

నిజామాబాద్: సస్పెన్షన్ కు గురైన ఇద్దరి వాంగ్మూలం తీసుకున్న అధికారులు

రిజిస్ట్రేషన్ శాఖలో సస్పెన్షన్ కు గురైన ఇద్దరి వాంగ్మూలం తీసుకున్న అధికారులు


నిజామాబాద్ రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో కీలక అడుగు ముందుకు పడింది. మెదక్ జిల్లా రిజిస్టర్ రవీందర్ విచారణ చేపడుతున్నారు. నిజామాబాద్ డిఐజి కార్యాలయంలో మరోసారి విచారణ చేపట్టారు. రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్టర్ లో ఉన్న ఇద్దరు సస్పెన్షన్ కు గురైన వారి వాంగ్మూలం అధికారులు సేకరించారు. విచారణలో గుర్తించిన సమాచారంతో శాఖాపరమైన చర్యల కోసం నివేదిక సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలల్లో బయట పడ్డ నాన్ లే అవుటు భూములకు దస్తావేజులు పుట్టించి ఈ జిల్లాలో పెద్ద చర్చనీయాంశంగా మారి బాధితులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ నారాయణ రెడ్డి విచారణకు ఆదేశించిన తదనంతరం అక్రమ రిజిస్ట్రేషన్లు వ్యాపారం బయటపడింది. గత నెల 10న  విచారణ జరిపి ముగ్గురు అధికారులను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అప్పటి నుంచి శాఖాపరమైన విచారణ మొదలుపెట్టి కొత్తగా ఇద్దరు అధికారులు అక్రమాలు చేసినట్టు గుర్తించి ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ఆధారంగానే శాఖాపరమైన విచారణ జరుగుతున్నట్లు సమాచారం.

Anantapur News : ఆత్మకూరులో ఉద్రిక్తత, కాల్వ శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 

Anantapur News :  మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులును ఆత్మకూరు మండలం వడ్డుపల్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం ప్రసన్న వెంకటరమణ స్వామి కళ్యాణోత్సవంలో జరిగిన జాప్యంపై తన మాటలను మరోసారి నిరూపించేందుకు మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు శనివారం ఉదయం11.30గంటలకు స్వామివారి గుడికి వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మండలం, వడ్డుపల్లి వద్ద పోలీసులు రాయదుర్గం వెళ్లనీయకుండా కాల్వ శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్నారు. తనను అడ్డుకునే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నిచారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో లిఖిత పూర్వకంగా రాసివ్వాలని కాలవ డిమాండ్ చేశారు.

Chittoor Crime : చిత్తూరు జిల్లాలో ఇద్దరి దారుణ హత్య  

Chittoor Crime : చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సదుం మండలం ఎగువ జాండ్రపేటలో ఇద్దరి హత్యకు గురయ్యారు. మృతులు వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న రాధ, వెంకటరమణగా స్థానికులు గుర్తించారు. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి బండరాయితో కొట్టి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులు అనంతపురం జిల్లా వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Save TDP : చంద్రబాబు పర్యటన వేళ కళ్యాణదుర్గంలో మారుమోగిన సేవ్ టీడీపీ నినాదం

Save TDP : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన వేళ సేవ్ టీడీపీ నినాదం మారుమోగింది. ఇక్కడ మూడు గ్రూపులుగా ఏర్పడి టీడీపీ పార్టీని నాశనం చేస్తున్నారని తెలుగు యువత నాయకులు ఆరోపిస్తున్నారు. మూడు గ్రూపులకు సంబంధం లేకుండా సేవ్ టీడీపీ నినాదంలో తెలుగు యువత ఫ్లెక్సీలు ప్రదర్శించింది. శుక్రవారం పార్టీ కార్యాలయం వద్ద నిరసన చేసిన తెలుగు యువత, ఇవాళ చంద్రబాబుని కలిసేందుకు బయలుదేరారు. మాజీ ఎమ్మెల్యే హనుమంతచౌదరి, ఇన్ ఛార్జి ఉమామహేశ్వరనాయుడు, ఇంకో వర్గం మధ్య విభేదాలు నడుస్తున్నాయని వీరంతా ఆరోపిస్తున్నారు. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి అని తెలుగు యువత నాయకులు అంటున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చంద్రబాబు ఎవరినో ఒక నాయకుడిని ప్రకటించి పార్టీని కాపాడాలని తెలుగు యువత నాయకులు కోరుతున్నారు. 

Palnadu News : పిడుగురాళ్ల రైల్వే క్వార్టర్స్ లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య 

Palnadu News : పల్నాడు జిల్లా పిడుగురాళ్ల రైల్వే క్వార్టర్ లో సత్య వర్ధన్ అనే రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబకలహాలు, అప్పుల బాధ తాళలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు అంటున్నారు. 45 రోజుల క్రితం సత్యవర్ధన్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈ ఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Palnadu News : పిడుగురాళ్ల రైల్వే క్వార్టర్స్ లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య 

Palnadu News : పల్నాడు జిల్లా పిడుగురాళ్ల రైల్వే క్వార్టర్ లో సత్య వర్ధన్ అనే రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబకలహాలు, అప్పుల బాధ తాళలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు అంటున్నారు. 45 రోజుల క్రితం సత్యవర్ధన్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈ ఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Background

భారత్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ(శనివారం) గ్రాముకి రూ.40 పెరిగింది. వెండి ధరలు 100 గ్రాములకు రూ.90 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల ధర 10 గ్రాములు రూ.50,950గా ఉంది. 


తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవాళ(శనివారం) భారీగా పెరిగాయి. తాజాగా 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకి రూ.40 పెరిగి, హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో 10 గ్రాముల ధర రూ.46,700గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర గ్రాముకి రూ.44 పెరిగి ప్రస్తుతం రూ.50,950(10 గ్రాములు) ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర గ్రాముకి రూ.0.90 పెరిగి హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.65,900(ఒక కేజీ) అయింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ప్రధాన నగరాల్లో బంగారం ధరలివే


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950


విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950


విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల ధర రూ.50,950


దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950


చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,860, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,210


ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 


కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700,, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 


బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950


కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950


వెండిధరలు: 


భారత మార్కెట్ లో వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి రూ.61,700 ఉండగా, చెన్నైలో రూ.65,900గా ఉంది. ముంబయిలో కిలో వెండి రూ.61,700 ఉండగా, కోల్‌కతాలో రూ.61,700, బెంగళూరులో కిలో వెండి రూ.65,900 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,900 ఉండగా, విజయవాడలో రూ.65,900 విశాఖలో రూ. 65,900  వద్ద కొనసాగుతోంది.


రష్యా - ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం


పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. తాజాగా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.