రైతుల సమస్యలపై టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో ఆందోళనలు చేపట్టనుంది. ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు రైతు కోసం తెలుగుదేశం పేరిట నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని 25 పార్లమెంట్‌ స్థానాలను 5 జోన్లుగా విభజించి రోజుకో జోన్‌ పరిధిలో నిరసనలు తెలపాలని నిర్ణయించింది. 5 పార్లమెంట్ స్థానాల పరిధిలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గోనున్నారు. ఇవాళ రాయలసీమ పరిధిలోని నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఆందోళన చేపట్టనున్నారు. 


ఐదు జోన్లలలో


రేపు(15వ తేదీ) కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, నరసాపురం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో, 16న ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో నిరసనలు చేపట్టనున్నారు. 17వ తేదీన అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లిలో, 18న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ స్థానాల పరిధిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనునన్నట్లు తెలుగుదేశం పార్టీ తెలిపింది. 


Also Read: TDP Fight : టీడీపీ వర్సెస్ టీడీపీ ! నేతల మధ్య ఆధిపత్య పోరాటమే ప్రతిపక్షానికి అసలు సమస్యా..!?


తహసీల్దార్లకు వినతి పత్రాలు


టీడీపీ సీనియర్‌ నేతలు అయ్యన్నపాత్రుడు, ధూళిపాళ్ల నరేంద్ర, జ్యోతుల నెహ్రూ, బి.సి.జనార్దన్‌రెడ్డి, కాలవ శ్రీనివాసులుకు జోన్ల బాధ్యతలు అప్పగించారు. నిరసనన అనంతరం తహసీల్దార్లకు వినతి పత్రాలు అందించనున్నారు. రాష్ట్రంలో రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే చేపట్టినట్లు రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. వైసీపీ ప్రభుత్వ వైఖరితో ఏపీలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని టీడీపీ ఆరోపిస్తుంది.


Also Read: EAPCET Results 2021: నేడు ఈఏపీసెట్ అగ్రి, ఫార్మసీ విభాగాల ఫలితాలు.. రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే​


నారా లోకేశ్ పాల్గొనే అవకాశం


వర్షాలు బాగా కురిసినా సాగునీరు అందకపోవడం, పంట కాలువలు, డ్రెయిన్లలో పూడిక తొలగించకపోవడం, వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్ల బిగింపు, విత్తనాలు, ఎరువులపై రాయితీలు నిలిచిపోవడం వల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొంది. బీమా, పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీలు ఇలాంటి సమస్యలపై పోరాటం కొనసాగుతుందని చెబుతున్నారు. రైతులకు రుణమాఫీ రద్దు, రైతురథం ద్వారా ట్రాక్టర్లు అందించే పథకాన్ని నిలిపివేయడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ నెల 17న ఉత్తరాంధ్రలో జరిగే నిరసన కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొనే అవకాశం ఉంది.


Also Read: Dalitha Bandhu News: మూడు వారాల్లోనే దళిత బంధు నిధులు.. ముగిసిన సీఎం రివ్యూ, హాజరైన భట్టి విక్రమార్క