ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలను మెరుగు పరిచేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్య పరికరాల అధునీకరణ, పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని నియమించేందుకు సిద్ధమైంది. దీని ప్రకారం వైద్య విద్యార్థులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసేలా తగిన చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో శాశ్వత నియామకాల కింద నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నా, పనిచేసేందుకు వైద్యులు అంతగా ఆసక్తి చూపడంలేదు. తాజాగా చేపట్టిన వైద్యుల నియామకాల్లో రెండేళ్ల ప్రొబేషన్‌ను ప్రభుత్వం మూడేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై వైద్యులు ఎంతమేర ఆసక్తి చూపిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. వైద్య విధాన పరిషత్‌ జిల్లా ఆసుపత్రులు, సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రుల్లోని 12 విభాగాల్లో 453 పోస్టుల భర్తీకి ప్రకటన చేస్తే 800 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు తెలిపింది. 


Also Read: IAS Officers Transfer: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... 14 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ... పదోన్నతుల కనీస సర్వీసు తగ్గింపు


కన్సాలిడేటెడ్ వేతనం


బోధనాసుపత్రుల్లో ప్రత్యక్ష విధానంలో 32, లేటరల్‌ ఎంట్రీ ద్వారా 17 మంది వైద్యుల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించారు. వీటికి కేవలం 90 మందే దరఖాస్తు చేసుకున్నారు.  వైద్య విధాన పరిషత్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌లో కన్సాలిడేటెడ్‌ వేతనం కింద నెలకు రూ.53 వేలను చెల్లిస్తామని ప్రకటించారు. తొలి మూడేళ్ల ప్రొబేషన్‌ పీరియడ్‌లో పనితీరు సంతృప్తికరంగా ఉంటే  రెగ్యులర్ వేతనంతోపాటు ఇతర అలవెన్సులు అందిస్తామని ప్రకటించింది.  ఈ ప్రకటనలో మూడేళ్లపాటు ప్రొబేషన్‌ పీరియడ్‌ ఉంటుందని తెలిపింది. అలాగే నెలకు రూ.92 వేలు కన్సాలిడేటెడ్‌ వేతనం ఇస్తామని వెల్లడించింది. 


Also Read: Covid 19 India Cases: దేశంలో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు.. కరోనా థర్డ్ వేవ్‌‌కు సన్నద్ధం కావాలి.. ఆరోగ్య నిపుణులు


వేతనాల వ్యత్యాసాలు


రెగ్యులర్‌ స్కేల్‌కు బదులు కన్సాలిడేటెడ్‌ వేతనం ఇస్తామని చెప్పడంతో.. వైద్య విధాన పరిషత్‌ ద్వారా నియమితులయ్యే వైద్యులకు అందే మొత్తం వేతనంలో రూ.25 వేలు తగ్గుతోంది. ప్రొబేషన్‌ పీరియడ్‌ తగ్గించి, వేతనాల్లో ఉన్న వ్యత్యాసాన్ని తొలగించాలని ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రభుత్వానికి కోరుతున్నారు. ఈ రెండు నోటిఫికేషన్లలో మూడేళ్ల ప్రొబేషన్‌పై శాఖాపరమైన నిబంధనలను మార్చారా అని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర అధికారులు ప్రశ్నిస్తే సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. నర్సులు, పారా మెడికల్‌ సిబ్బందికి ఇచ్చే వేతనాల చెల్లింపుల్లోనూ వ్యత్యాసాల తొలగింపునకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 


 


Also Read: Corona Updates: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులివే.. దేశంలో 31వేలకు పైగా ఆందోళనకర వేరియంట్లు