AP High Court: ఏపీ సీఐడీ చీఫ్‌, ఏఏజీ పొన్నవోలుపై చర్యలకు డిమాండ్ - హైకోర్టులో పిటిషన్‌

ఈ ప్రెస్ మీట్ ల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని సత్యనారాయణ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వట్లేదని కోర్టుకు వెల్లడించారు.

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్‌ సంజయ్‌, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై చర్యలు తీసుకొనేలా ఆదేశించాలని ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయింది. వారు ఇద్దరి తీరుపైన ఓ ఎన్‌జీవో నిర్వహకుడు కోర్టుకు వెళ్లారు. స్కిల్‌ డెవలప్ మెంట్ కేసు దర్యాప్తు దశలో ఉండగా సంజయ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి పలుసార్లు ప్రెస్‌ మీట్లు పెట్టారని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సత్యనారాయణ ఆరోపించారు. ఈ ప్రెస్ మీట్ ల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని సత్యనారాయణ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వట్లేదని కోర్టుకు వెల్లడించారు. కోర్టు పర్మిషన్ తో మరోసారి ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించాలని.. వారి ప్రెస్ మీట్ ల వల్ల ఎంత మేర ప్రజాధనం ఎంత వృథా అయిందో బయటకు చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.

Continues below advertisement

చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు అయిన తర్వాత ఆ కేసు వివరాల గురించి ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కలిసి మీడియా సమావేశాలు నిర్వహించారు. అమరావతిలోనే కాక, హైదరాబాద్‌లో, ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్లు పెట్టారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుపై ఉన్న ఆరోపణలను వివరించారు.

Continues below advertisement