జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉదయాన్నే పొలిటికల్ ర్యాగింగ్ మొదలు పెట్టారు. అప్పుడెప్పుడో వచ్చిన పాపం పసివాడు పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేసి ఇలాంటి సినిమా ఏపీ సీఎంతో తీయాలని కామెంట్ చేశారు. ఆయన కూడా చాలా అమాయకుడని చెప్పుకొచ్చారు. అయితే ఆ పిల్లాడి చేతిలో ఉన్నది ఒక్క సూట్‌ కేసు మాత్రమేనని... అక్రమంగా సంపాదన కోసం మనీలాండరింగ్ సులభతరం చేసే మల్టిపుల్ సూట్‌కేస్‌ కంపెనీలనుజగన్ చేతిలో ఉంచాలని సూచించారు. 


ఇంకా ఏమన్నారంటే... డియర్‌ ఏపీ సీఎం, మీరు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య లేదా కామ్రేడ్ తరిమెల నాగి రెడ్డి కాదు. అక్రమ సంపాదనతో ప్రజలపై హింస సాగిస్తున్న మీరు క్లాష్‌వార్‌  అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా హక్కు లేదని కటువుగా చెప్పారు. ఏదో ఒక రోజు రాయలసీమ మీ నుంచి, మీ గుంపు బారి నుంచి విముక్తమవుతుందని ఆశిస్తున్నాను అంటూ ముగించారు. 






కింద పీఎస్‌ అని మరో నోట్ పెట్టారు. పైన చెప్పిన స్టోరీకి రాజస్థాన్ ఎడారి ఇసుక దిబ్బలు కావాలని, కానీ వైసీపీ APలోని నదీ తీరాల నుంచి దోచుకుంది, కలెక్షన్ పాయింట్లలో తగినంత ఇసుక దిబ్బలు ఉన్నాయిని చెబుతూ చివర్లో చీర్స్ అంటూ క్లోజ్ చేశారు.