వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం 2023 - 24 కౌలు రైతులకు మొదటి విడత సాయాన్ని నేడు (ఆగస్టు 31) సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్ధి దారుల ఖాతాలోకి నిధులు జమ చేస్తారు.
ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా..ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక చేయూత అందించడానికి 15 అక్టోబర్, 2019 నుంచి వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది.. అర్హులైన భూ యజమాని కుటుంబాలను ఈ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తించి, వారికి మొదటి విడత రూ. 7500/- మే నెలలో (పీఎం కిసాన్ లబ్ధిరూ. 2000/- లను కలిపి), రెండో విడత రూ. 4000/- అక్టోబర్ నెలలో (పీఎం కిసాన్ లబ్ధిరూ. 2000/- లను కలిపి),మూడో విడత రూ. 2000/- ప్రత్యేకంగా పీఎం కిసాన్ లబ్ధిని జనవరి నెలలో అందజేయడం జరుగుతుంది. అదే విధంగా రాష్ట్రంలో భూమి లేని షెడ్యూల్ తెగలు , షెడ్యూల్ కులం, వెనకబడిన కులాలు, మైనారిటీ వర్గాలకు చెందిన కౌలు రైతు కుటుంబాలకు, దేవాదాయ భూములు అటవీ భూమి సాగుదారులకు సంవత్సరానికి రూ. 13,500/- చొప్పున ఆర్థిక సహాయం 3 విడతలలో రైతుల ఖాతాలలోకి రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది. మొదటి విడత రూ. 7500/- లబ్ధిని మే నెలలో, రెండో విడత రూ. 4000/- లబ్ధిని అక్టోబర్ నెలలో, మూడో విడత రూ. 2000 లబ్ధిని జనవరి నెలలో అందజేస్తున్నారు.
2019-20 లో పథక అమలు తీరు...మొత్తం లబ్ధిదారులు : 46,69,375భూ యజమాని కుటుంబాలు : 45,11,252 లుగా ఉన్నాయి..భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాస్తవ సాగుదారులు : 1,08,256అటవీ భూమి సాగుదారులు : 49,867లబ్ధి మొత్తం : రూ.6173 కోట్లు (వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధి: రూ.3,648 కోట్లు + పీఎం కిసాన్ లబ్ధి: రూ.2525 కోట్లు)
2020-21 లో పెరిగిన తీరు..మొత్తం లబ్ధిదారులు : 51,59,045భూ యజమాని కుటుంబాలు : 50,04,874భూమిలేని ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాస్తవ సాగుదారులు: 69,899అటవీ భూమి సాగుదారులు : 84,272లబ్ధి మొత్తం : రూ.6928 కోట్లు (వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధి : రూ.3962 కోట్లు + పీఎం కిసాన్ లబ్ధి: రూ.2966 కోట్లు)
2021-22 సంవత్సరంలో పథకం అమలు తీరు..మొత్తం లబ్ధిదారులు : 52,38,517భూ యజమాని కుటుంబాలు : 50,66,241భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాస్తవ సాగుదారులు : 89,877అటవీ భూమి సాగుదారులు : 82,399లబ్ధి మొత్తం : రూ.7,016.59 కోట్లు(వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధి: రూ.4051.87 కోట్లు + పీఎం కిసాన్ లబ్ధి: రూ.2964.72 కోట్లు)
2022-23 సంవత్సరంలోమొత్తం లబ్ధిదారులు : 51,40,943భూ యజమాని కుటుంబాలు : 49,26,041భూమిలేని ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాస్తవ సాగుదారులు: 1,23,871అటవీ భూమి సాగుదారులు : 91,031లబ్ధి మొత్తం : రూ.6944.50 కోట్లు (వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధి : రూ.4015.94 కోట్లు + పీఎం కిసాన్ లబ్ధి: రూ.2928.56 కోట్లు)
ఈ ఏడాది 2023-24 సంవత్సరం మొదటి విడత లబ్ధి జూన్ 1న భూ యజమానులు, అటవీ భూమి సాగుదారులకు రూ.3833.21 కోట్లు విడుదల చేయడం జరిగింది. కౌలు దారులకు మొదటి విడత లబ్ధి ఆగస్టు 31న విడుదల చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. రూ.109.74 కోట్లు 14,6324 భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాస్తవ సాగుదారులకు (3631 దేవాదాయ భూమి సాగుదారులతో కలిపి) అందించడం జరుగుతుందని,దీనితో 2023-24 వ సంవత్సరంలో మొదటి విడత లబ్ధి మొత్తం 52,57,263 రైతులకు రూ. 3942. 95 కోట్లు అందుతుంది.మొత్తం లబ్ధిదారులు : 51,10,939భూ యజమాని కుటుంబాలు : 50,19,187అటవీ భూమి సాగుదారులు : 91,752లబ్ధి మొత్తం : రూ.3833.21 కోట్లు (వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధి: రూ.2829.37 కోట్లు + పీఎం కిసాన్ లబ్ధి: రూ.1003.84 కోట్లు)గా లెక్కలు చెబుతున్నాయి. 2019-20 నుంచి ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా మొత్తం రూ.31005.04 కోట్ల లబ్ధి రైతు కుటుంబాలకు అందించడం జరిగినదని ప్రభుత్వం ప్రకటించింది.