Big Changes In the Spandana System In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన స్పందన వ్యవస్థను సమూలంగా మార్చేస్తోంది. ఈ పేరను తొలగించింది. ఇప్పుడు పబ్లిక్ గ్రీవెన్స్‌ రెడ్రెస్సల్‌ సిస్టమ్‌ పేరుతో వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనుంది. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లలో ప్రజలు తమ ఫిర్యాదులు చేయవచ్చు. వాటిని ఎప్పటికప్పుడు సీఎంవో సహా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి సమస్యలను పరిష్కరించేలా ఈ వ్యవస్థను రూపొందించారు.