స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు వేసిన పిటిషన్‌పై కౌంటర్ వేయాలని సీఐడిని ఆదేశిస్తూ విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది. 


స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అరెస్టు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మొదట ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్ పెట్టుకున్నారు. అక్కడ తిరస్కరణకు గురి కావడంతో ఆయన హైకోర్టు మెట్లు ఎక్కారు.