ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ టీడీపీ నేతలకు ఇచ్చిన అపాయింట్‌మెంట్ ను రద్దు చేశారు. మొదట ఇవాళ ఉదయం 9.45 గంటలకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వగా దాన్ని రద్దు చేసినట్లుగా రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఫిర్యాదు చేయడానికి ఆ పార్టీ నేతలు గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు.