పల్నాడు జిల్లా క్రోసూరులో జగనన్న విద్యాకానుక కిట్ పంపిణీని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. అదే ఊరి స్కూల్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్‌ తరగతి గదులను పరిశీలించారు. క్లాస్‌రూమ్‌లో విద్యార్థులో ముచ్చటించారు.


ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫామ్‌ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతోపాటు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ (6–10 తరగతి పిల్లలకు), పిక్టోరియల్‌ డిక్షనరీ (1–5 తరగతి పిల్లలకు)ని ఈ విద్యా కానుక కిట్‌లో ఉంచారు. 


రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పాఠశాలలు, ఎయిడెడ్ బడుల్లో చదువుతున్న 43,10,165 మందికి ఈ కిట్ అందజేయనున్నారు. దీని కోసం ప్రభుత్వం 1,042.53 కోట్లు ఖర్చు పెట్టింది. ప్రతి విద్యార్థిపై దాదాపు రూ.2,400లు వెచ్చిస్తున్నట్టు ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. ఈ కిట్‌కు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) తో సహా 4 దశల్లో నాణ్యత పరీక్షలు చేశారు. 


గతలో స్కూల్స్ తెరిచిన ఆరేడు నెలల వరకు యూనిఫామ్స్ వచ్చేవి కావని పుస్తకాలు కూడా ఏడాది చివరి వరకు పంపిణీ చేస్తుంటే వాడని నేటి ప్రభుత్వం చెబుతోంది. అలాంటి నిర్లక్ష్యాలకు స్వస్తి చెప్పి. స్కూల్ స్టార్ట్ అయిన మొదటి రోజే ఈ కిట్ అందజేస్తున్నట్టు పేర్కొంటోంది. 10 వస్తువులతో కూడిన విద్యా కానుక కిట్ అందచేయటం గొప్ప విషయంగా చెప్పుకుంటోంది. ఏపీ విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా, రాబోయే రోజుల్లో ప్రతి బడి ఇంగ్లీషు మీడియంతో సీబీఎస్ఈ సిలబస్ తీసుకువస్తున్నట్టు పేర్కొంటోంది. 


విద్యా కానుక ద్వారా పొందిన వస్తువుల్లో ఏమైనా ఇబ్బందులుంటే విద్యార్థులు తమ స్కూల్ హెడ్ మాస్టార్‌కు వాటిని అందిస్తే వారం రోజుల్లో రీప్లేస్ చేస్తారు. అప్పటికి సమస్యల పరిష్కారం కాకపోయినా, లేదంటే మరే ఇతర ఫిర్యాదులున్నా 14417 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేసే సదుపాయాన్ని సర్కార్ అందుబాటులోకి తెచ్చింది. 


పథకం                     లబ్ధిదారులు               ఖర్చు చేసిన నిధులు 
అమ్మఒడి                   44,48,865,                    19,674.34 కోట్లు 
విద్యా కానుక                47,40,421,                   3,366.53కోట్లు 
గోరుముద్ద                   43,26,782                     3,590.00కోట్లు. 
స్వేచ్ఛ                        10,01,860                     32,00 కోట్లు


పాఠశాలల్లో నాడు నేడు మొదటి దశలో 15,715 స్కూల్స్ లో 3,669.00కోట్లు ఖర్చు చేశారు. పాఠశాలల్లో నాడు నేడు రెండో దశ 22,344 స్కూల్స్‌లో 8,000.00కోట్లతో పనులు చేశారు. మూడు దశల్లో రూ. 17,805 కోట్ల వ్యయంతో మొత్తం 45,975 స్కూల్స్‌లో అభివృద్ది పనులు చేపట్టామని ప్రభుత్వం వెల్లడిస్తోంది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ లబ్ధిదారుల సంఖ్య 35,70,675 కాగా అందించిన మొత్తం 6,141.34కోట్లని ప్రకటించారు. 5,18,740 మంది 8 వ తరగతి విద్యార్ధులు, టీచర్లకు 685.87కోట్లతో ట్యాబ్ లు అందించామని చెబుతోంది.