YSRCP news :  నిజం గెలవాలంటూ చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తున్నారని.. నిజం గెలవాల్సిందేనని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.  ఏనాటికైనా నిజం గెలవాలని రాష్ట్రం మొత్తం కోరుకుంటుంది. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర్నుంచి ఇప్పటికీ.. అంటే, దాదాపు 40 ఏళ్లుగా జరుగుతున్న నిజం అందరూ తెలుసుకోవాలన్నారు.  ఇవాళ  నిజం గెలిచి చూపిస్తోంది. కాబట్టే.. చంద్రబాబు  జైల్లోకి వెళ్లారన్నారు.  చంద్రబాబు ఇన్నాళ్లూ తొక్కేసిన నిజాలు ఇవాళ గెలుపు దిశగా పయనిస్తున్నాయి. కాబట్టే.. ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టులో నిజం గెలుస్తోంది. చంద్రబాబుకు సంబంధించిన ఏ పిటీషన్‌ వేసినా ఆయా కోర్టుల్లో ఫలితంలేకుండా పోతున్నాయన్నారు.  


17ఏను ఎందుకు పట్టుబడుతున్నారు ? 


నిజం గెలవాలని కోరుకునేవాళ్లు పీసీయాక్ట్‌ 17ఏ ని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు..? అది నిజం కాదుకదా..? అదొక సాంకేతిక పాయింట్‌నే కదా..?  అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎందుకు ఆ పాయింట్‌ మీదనే పోరాడుతున్నారు..? నిజాల్ని ఓడించాలనే మీ ప్రయత్నం ఏ కోర్టుకెళ్లినా.. ఎక్కడకెళ్లినా విఫలమవుతోంది తప్ప గెలిచే ప్రసక్తేలేదని చెబుతున్నానన్నారు.  విచిత్రమైన విషయమేమంటే, చంద్రబాబు అరెస్టయితే గుండెలు పగిలి కొందరు మరణించారని ప్రాచరం ేచ్సతున్నారని..    105 మంది గుండెలు పగిలి చనిపోయారంటూ..  ఎమోషన్‌ క్రియేట్‌ చేసే ప్రయత్నాలకు పాల్పడుతున్నారని విమర్శఇంచారు. అయితే  ఎవరూ భావోద్వేగానికి గురికావడం లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. 


చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబసభ్యుల నాటకాలు
 
బాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన, ఆందోళన అంతా ఒక నాటకం- బూటకం. నిజానికి ఆయన సంపూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు ఈరోజు ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరిచిన క్రమంలో వెల్లడైన వాస్తవమన్నారు.  ఆయన్ను జడ్జి గారు కూడా ఆరోగ్యం గురించి అడిగారు. అయితే, తనకు పాతిక,ముఫ్పై ఏళ్లుగా ఆరోగ్య సమస్యలున్నాయని మాత్రమే చెప్పారు తప్ప కొత్తగా అనారోగ్యమేదీలేదన్నారన్నరు.   ఆయన అరెస్టయిన మొదట్నుంచీ వారి పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు కలిసి చాలా సింపతీ డ్రామాలకు ప్రయత్నించారు. సెక్యూరిటీ లేదన్నారు. దోమలన్నారు. స్కిన్‌అలెర్జీ ...అంటూ నానా రచ్చ చేశారు. ఏది చేసినా వారి సింపతీడ్రామాలు మాత్రం రక్తికట్టడం లేదు. ఎందుకంటే, వాస్తవాల్ని ప్రజలు గమనిస్తున్నారు. నిజం ఏనాటికైనా గెలుస్తుంది కాబట్టి.. మీ దుర్మార్గమైన ఆలోచనలు, కుట్రల్ని కట్టిపెట్టాలని మనవి చేస్తున్నానని అంబటి రాంబాబు తెలిపారు. .


మీకే భవిష్యత్తు లేదు.. మీరెవరికి గ్యారంటీ ఇస్తారు? 


చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితులు కనుచూపు మేరలో కనిపించడంలేదని మేధావులు, న్యాయ విశ్లేషకులు చెబుతున్నారని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.  ఎందుకంటే, ఆయన అవినీతికి సంబంధించిన ఆధారాలు అంత పకడ్బందీగా ఉన్నట్లు వారంతా తేల్చి ప్రజలకు కళ్లకు కట్టినట్లు డిబేట్ల ద్వారా వివరిస్తున్నారన్నారు.   ఈక్రమంలో రూ.కోటాను కోట్లు తీసుకున్న ఢిల్లీ న్యాయవాదులు సైతం బహుశా నారా లోకేశ్‌కు తన తండ్రి భవిష్యత్తు గురించి చెప్పి ఉంటారనుకుంటాను. అందుకనే, రాజకీయాల్లో భవిష్యత్తు లేని నారా లోకేశ్‌ భవిష్యత్‌కు గ్యారెంటీ అని తాపత్రయపడుతున్నారు. ఇన్నాళ్లూ యువగళం అంటూ యాత్ర చేసిన ఆయన  ఇప్పుడు భవిష్యత్తుకు గ్యారంటీ అని ఆరాటపడటంలో అర్ధమేమీలేదు. ఆయన ఆరాటం, పోరాటం ప్రజాక్షేత్రంలో అభాసుపాలవడం ఖాయమని హెచ్చరించారు. 
  
ప్రభుత్వంపై నిందలేయడం మర్యాద కాదు


న్యాయస్థానాల్లో విన్నవించాల్సిన విషయాల్ని అక్కడ వాదించకుండా.. రాజమండ్రి సెంట్రల్‌ జైలు వద్ద ప్రస్తావిస్తూ టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులు గందరగోళపరుస్తున్నారన్నారు.  జగన్‌మోహన్‌రెడ్డిపై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నారు. ఇప్పటికైనా వారు నిజాల్ని గ్రహించకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు.  చంద్రబాబు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో జ్యుడీషరీ కస్టడీలో ఉన్నారు. జైళ్ల అధికారులకు కోర్టుల నుంచి అందే ఆదేశాల మేరకే చంద్రబాబు విషయంలో బాధ్యతగా ఉంటారు మినహా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదన్నారు.  ముఖ్యమంత్రి, హోంమంత్రి ఆదేశాలతో జైళ్లశాఖ అధికారులు నడుచుకునే పరిస్థితి ఉండదన్నారు.