ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 41,954 కరోనా పరీక్షలు చేయగా.. 3,205 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన మెుత్తం కరోనా కేసుల సంఖ్య 20,87,879కి చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనా వైరస్ కారణంగా.. ఎవరూ చనిపోలేదు. తాజాగా 281 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మెుత్తం 20,63,255 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 10,119 యాక్టివ్ కేసులు ఉన్నాయి.






దేశంలో కరోనా కేసులు


దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 1,94,720 కరోనా కేసులు నమోదయ్యాయి. 442 మంది వైరస్‌తో మృతి చెందారు. 60,405 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,46,30,536కు పెరిగింది.


మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కి పెరిగింది. ఇందులో 1805 మంది రికవరయ్యారు.





ఒమిక్రాన్ కేసుల సంఖ్యలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో 1281 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. దిల్లీని దాటి రాజస్థాన్ రెండో స్థానానికి వచ్చింది. రాజస్థాన్‌లో 645 ఒమిక్రాన్ కేసులు ఉండగా దిల్లీలో 546 ఉన్నాయి. 




చాలా రాష్ట్రాల్లో మంగళవారం కరోనా కేసులు పెరిగాయి. బంగాల్‌లో 21,098 మందికి కరోనా సోకింది. దీంతో మరోసారి రోజువారి కేసుల సంఖ్య లక్ష మార్కు దాటింది. తమిళనాడులో 15,379 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో 9,066 కేసులు నమోదయ్యాయి.


పండుగ సీజన్ కావడంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించాలని లేకుంటే మరో దారుణమైన కరోనా వేవ్ చూడాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.


Also Read: Anantapur TDP: అనంతపురం టీడీపీ నేతల్లో ఎన్నికల జోష్... అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా రాజకీయాలు !


Also Read: AP Tickets Issue : వైఎస్ఆర్‌సీపీ నేతలకూ సినిమా ధియేటర్లు.. అయినా పట్టించుకోవడం లేదని ఎగ్జిబిటర్ల అసంతృప్తి !