AP Annadata Sukhibhava Status: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. గతంలో ఉన్న పెట్టుబడి సాయం పథకాలను పునర్వ్యవస్థీకరించి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలుస్తోంది. 

Continues below advertisement

సాధారణంగా వ్యవసాయం అంటేనే పెట్టుబడితో కూడిన రిస్క్‌. విత్తనం వేసిన దగ్గరి నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతుకు అడుగడుగునా ఆర్థిక అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలను గుర్తించి, సకాలంలో పెట్టుబడి సాయంతో అందిస్తే సాగు లాభసాటిగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఏటా ఇచ్చే ఆర్థిక సాయాన్ని 20వేలకు పెంచుతూ గత ఏడాది  నుంచి నగదు ఇస్తోంది. 

రాష్ట్రంలో సుమారు 46.85 లక్షల మంది రైతు కుటుంబాలకు సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు భారీగా పెరిగాయి. ఇలాంటి తరుణంలో రైతు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండేందుకు పెట్టుబడి సాయం ఒక రక్షణ కవచంలా పని చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను భారీగా జోడించి ఈ అన్నదాత సుఖీభవను రూపొందించింది. 

Continues below advertisement

నిధులు ఎప్పుడు విడుదల అవుతాయి?

ప్రస్తుతం రైతులంతా 2026-27 వ్యవసాయం సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్‌ సీజన్ మొదటి విడత కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ లేదా జులై నెలలో ఈ నిధులు విడుదల చేయడానికి వ్యవసాయం శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. సాధారణంగా జూన్ నెలలో వర్షాలు మొదలై విత్తనాలు వేసే సమయం కాబట్టి, ఈ సమయంలో ఇచ్చే సాయం రైతులకు ఎంతో మేలు చేస్తుంది. క్షేత్రస్థాయిలో అర్హులైన రైతుల జాబితా రూపకల్పన, ఈకేవైసీ ప్రక్రియను, రెవెన్యూ భూ రికార్డుల పరిశీలన ప్రస్తుతం తుది దశలో ఉన్నాయి. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. 

గత ఆర్థిక సంవత్సరం విషయానికి వస్తే చివరి విడత నిధులను ప్రభుత్వం మార్చి 13న ఉగాది కానుకగా విజయవంతంగా పంపిణీ చేసింది. 

ఈ పథకం కింద రైతులకు అందే ఇరవై వేలు ఒకేసారి కాకుండా సాగు అవసరాలకు అనుగుణంగా మూడు విడతల్లో అందుతుంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. 

విడత  పంపిణీ సమయంమొత్తంఉద్దేశం
మొదటి విడత(ఖరీఫ్)జూన్/జులై7000/7500విత్తనాలు, ఎరువుల కొనుగోలు
రెండో విడత(రబీ)అక్టోబర్‌/నవంబర్‌6000/7000శీతాకాల పంటల సాగుకు సాయం 
మూడో విడత(సమ్మర్)  ఫిబ్రవరి/మార్చి6000ముగింపు విడత(పీఎం కిసాన్‌తో కలిపి)

గత విడతలో సుమారు 46.85 లక్షల మంది రైతులు 6000 చొప్పున లబ్ధి పొందారు. 

మీ పేమెంట్ స్టేటస్‌, అర్హత ఎలా చెక్ చేయాలి?

సాంకేతికతను జోడించి ప్రభుత్వం ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మార్చింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా మీ మొబైల్‌ ద్వారా స్టాటస్ తెలుసుకోవచ్చు. ముందు అధికారిక annadathasukhibhava.ap.gov.in పోర్టల్‌ను సందర్శించాలి. హోమ్‌ పేజీలో కనిపించే Know Your Status లేదా Beneficiary Detailsపై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ లేదా రిజిస్టర్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. మీ మొబైల్‌కు వచ్చే వన్‌టైమ‌ పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేసి సబ్మిట్‌ చేస్తే, మీ పేమెంట్‌ విజయవంతమైందా లేదా పెండింగ్‌లో ఉందా అనేది స్పష్టంగా కనిపిస్తుంది. 

నిధులు మీ ఖాతాలో కొన్ని విషయాలు చెక్ చేయాలి

మీ ఆధార్ నెంబర్ తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాకు, మీ భూమి రికార్డులకు లింక్ అయ్యి ఉండాలి. వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. మీరు అర్హులై ఉండి కూడా జాబితాలో పేరు లేకపోయినా, లేదా సాంకేతిక సమస్యలు ఎదురైనా వెంటనే మీ గ్రామం లేదా వార్డు సచివాలయంలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి. 

ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు భరోసా కల్పించడమే కాకుండా, వ్యవసాయాన్ని ఒక గ్రామం లేదా వార్డు సచివాలయంలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి.