అజ్ఞాతవాసంలో భాగంగా పాండవులు ద్వైతవనానికి చేరుకున్నప్పుడు.... ఓ పండితుడు ధర్మరాజు వద్దకు వెళ్లి సహాయం అడుగుతాడు .
తనవద్దనున్న 'అరణి' (నిప్పు పుట్టించడానికి ఉపయోగపడే కొయ్య)ని ఒక మృగం అపహరించిందని దాన్ని సంపాదించిపెట్టమని ప్రార్థిస్తాడు. ఆ పనిపై వెళ్లిన తన సోదరులు ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో ధర్మరాజు వాళ్లను వెతుక్కుంటూ వెళతాడు.
ఓ సరస్సు దగ్గర విగతజీవులైన సోదరులను చూసి నోరు పిడచ గట్టుకుపోతుంది. నీళ్లు తాగుదామని సరస్సులో దిగుతుండగా ఓ యక్షుడి హెచ్చరిక వినిపిస్తుంది.
తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని యక్షుడు కోరడంతో సరే అంటాడు ధర్మరాజు. ఇంతకీ యక్షుడు ఎవరంటే యమధర్మరాజు. పాండవులను పరీక్షించటానికి యముడే ఆ రూపంలో వచ్చి ప్రశ్నలు అడిగాడు
1 సూర్యుణ్ణి ఉదయించేలా చేసినదెవరు Ans: బ్రహ్మం
2 సూర్యుని చుట్టూ తిరిగేదెవరు? Ans: దేవతలు
3 సూర్యుని అస్తమింపచేసేది ఏది? Ans: ధర్మం
4 సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? Ans: సత్యం
5 మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? Ans: వేదం
6 దేనివలన మహత్తును పొందుతాడు? Ans: తపస్సు
Thanks for Reading.
UP NEXT
ఐపీఎల్ 2022లో ఎక్కువ వయసున్న ఆటగాళ్లు - టాప్లో ఉన్నది ఎవరంటే?