ఫిబ్రవరి 5న... తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త కబుర్లు, వార్తలు, విడుదలైన పాటల వివరాలు!

'ఖిలాడి'లో రవితేజ, డింపుల్ హయతిపై తెరకెక్కించిన 'క్యాచ్ మి' పాటను విడుదలైంది. 

లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం.

సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన 'గుర్తుందా శీతాకాలం' టైటిల్ ట్రాక్ విడుదలైంది.

'సునీతకు ముసలి రామ్‌ మొగుడు' అంటూ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి 'నోటి దూల నీది, నీ భారం భూమిది' అంటూ సునీత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

'దర్జా' సినిమాలో అనసూయ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

సన్నగా కనిపించడం కోసం ఆన్‌లైన్‌లో యాప్స్‌ను ఉపయోగించానని, ఇప్పుడు వాటిని డిలీట్ చేశానని చెబుతూ... ఒరిజినల్ షేపులో ఉన్న ఫోటోను ఇలియానా పోస్ట్ చేశారు. 

వరుణ్ తేజ్ 'గని'లో ఓ పాటను ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి పాడారు. 

సినిమాలకు స్వస్తి పలుకుతున్నట్టు, ఈ ఏడాదే రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశారు.

తమన్ 137 కేజీల నుంచి 101 కేజీలకు తగ్గారు. అప్పటి, ఇప్పటి ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. 

తెలుగు తెరకు కన్నడ నటుడు రిషి పరిచయమవుతున్న 'వద్దురా సోదరా' టీజర్ విడుదలైంది.

'బిగ్ బాస్' సోహైల్ హీరోగా యాదాద్రిలో కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. 

కిరణ్ అబ్బవరం తాజా సినిమా 'సెబాస్టియన్ పీసీ 524' టీజర్ విడుదలైంది.

'ప్రేమ్ కుమార్' సినిమాలో అనురాగ్ కులకర్ణి పాడిన 'నీలాంబరం...' పాటను విడుదల చేశారు.

'ఓరి దేవుడా' సినిమాలో 'పాఠశాలలో...' గీతాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్టు తెలిపారు.

'టెన్త్ క్లాస్ డైరీస్'లో అవికా గోర్ పరిచయ గీతం 'ఎగిరే ఎగిరే...'ను విడుదల చేశారు.