ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 119 పాయింట్లు పెరిగి 17,107 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 445 పాయింట్లు ఎగిసి 58,074 వద్ద ముగిసింది.

నిఫ్టీ బ్యాంక్‌ 532 పాయింట్లు పెరిగి 39,894 వద్ద స్థిరపడింది.

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, రిలయన్స్‌, బజాజ్ ఫైనాన్స్‌, బజాజ్‌ ఆటో, ఎస్‌బీఐ లైఫ్‌ షేర్లు లాభపడ్డాయి.

పవర్‌ గ్రిడ్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, బ్రిటానియా, టెక్‌ మహీంద్రా, దివిస్‌ ల్యాబ్‌ షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు బలహీనపడి 82.66 వద్ద స్థిరపడింది.

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.60,000 గా ఉంది.

కిలో వెండి రూ.100 పెరిగి రూ.72,100 వద్ద కొనసాగుతోంది.

ప్లాటినం 10 గ్రాముల ధర రూ.370 పెరిగి రూ.26,160 వద్ద ఉంది.

బిట్ కాయిన్ 0.21 శాతం తగ్గి రూ.23,33,274 వద్ద ఉంది.