Two Men Stuck In Water Flow In Adilabad: వాగు ప్రవాహంలో చిక్కుకున్న ఇద్దరు కూలీలు
ABP Desam
Updated at:
04 Sep 2023 03:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తర్నం బ్రిడ్జి వద్ద ఆదివారం పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడ తాత్కాలిక బ్రిడ్జ్ పనులు చేపడుతున్నారు. ఆ సమయంలోనే... ఎగువన కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా వాగు ప్రవాహం అకస్మాత్తుగా పెరిగింది. పనులు చేస్తున్న ఇద్దరు కూలీలు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో వారు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో రెవెన్యూ, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చివరికి తాడు వేసి గజ ఈతగాళ్ల సహయంతో వారిద్దరినీ ఒడ్డుకు చేర్చారు.