Tornado ravages Medaram forest | మేడారం అడవిలో వేలసంఖ్యలో పెలికించుకుపోయిన వృక్షాలు | ABP Desam
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభారీ వర్షాలు..వరదలు మనుషులకు ఎంతటి కష్టాలను మిగిల్చాయో విజయవాడ, ఖమ్మం ప్రజలను చూస్తే అర్థమవుతోంది. కానీ అదే స్థాయిలో ప్రకృతికి తీరని చేటు చేసింది. తెలంగాణ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ములుగుజిల్లాను చుట్టేసిన సుడిగాలులు బీభత్సాన్ని సృష్టించాయి.ఇదిగో ఈ దృశ్యాలే ఆ ఘోర విపత్తుకు నిదర్శనం.ములుగు జిల్లాలోని తాడ్వాయి నుంచి మేడారం రోడ్డు మార్గంలో ఏర్పడింది ఈ విపత్తు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లన్నీ నేలకూలిపోయాయి. లోపలికి వెళ్లి చూసిన అటవీశాఖ అధికారులకు షాక్. భారీ సుడిగాలులకు వేలాది చెట్లు నేలరాలిపోయి కనిపించాయి. డ్రోన్లను ఉపయోగించి ఎంత నష్టం జరిగిందో గమనించిన అధికారులు ఈ విజువల్స్ చూసి ఆశ్చర్యపోయారు. దాదాపుగా 50వేల చెట్లు నేలకొరిగిపోయి కనిపిస్తున్నాయి. దాదాపుగా 150కిలోమీటర్ల వేగంతో వచ్చి సుడిగాలులు, గాలి వాన బీభత్సానికి వేలాది చెట్లు ఇలా పెకిలించుకోపోయాయని అధికారులు అంచనా వేస్తున్నారు.ఘటన జరిగిన ప్రాంతానికి మంత్రి సీతక్క అధికారులతో కలిసి వెళ్లారు. ఆ ప్రాంతమంతా కలియతిరిగారు. అధికారులు ఈ విపత్తుకు కారణం సుడిగాలులు అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. అనేక ఔషధ మొక్కలు,అరుదైన వృక్షాలు నేలకొరిగినట్లు గుర్తించిన అధికారులు ఆ వివరాలను సీతక్కకు తెలియచేశారు. వైల్డ్ లైఫ్ జోన్ గా ములుగు జిల్లా అడవుల్లో జరిగిన ఈ విపత్తును కేంద్ర మంత్రివర్గంలో ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డి పట్టించుకుని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లాలని మంత్రి సీతక్క కోరారు.