Khammam Fort: వెయ్యేళ్ల ఖమ్మం ఖిల్లా.. శత్రుదుర్బేద్యంగా నిర్మించిన చారిత్రక కట్టడం
తెలంగాణలోని చారిత్రక కట్టడల్లో ఖమ్మం ఖిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. వేయేళ్ళ క్రితం నిర్మించిన ఈ కట్టడంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. క్రీస్తు శకం 950 సంవత్సరంలో కాకతీయులు ఖమ్మం ఖిల్లాకు పునాదులు వేశారు. సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ 1531 ఏడాదిలో అప్పటి ఖమ్మం పాలకుడైన సీతాబ్ఖాన్ (సీతాపతిరాజు)ను ఓడించి ఖమ్మం కోటను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ దుర్గం కుతుబ్షాహి పాలనలో ఉంది.