RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం

సిరిసిల్ల ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. కొత్త CCTV ఫుటేజ్‌లో బయటపడిన అసలు కారణం చూస్తే షాక్ గురవుతారు. 




సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొత్త మలుపు చోటుచేసుకుంది. మొదట కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని భావించారు. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన మరో CCTV ఫుటేజ్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ చేసిన అతి వేగంగా ఓవర్‌టేక్ కార్యం ప్రమాదానికి మూలకారణమని తెలుస్తోంది. బస్సు ఒక్కసారిగా ఎడమవైపు తిరగడంతో స్కార్పియో కారు అదుపు తప్పి, బస్సు కోసం ఎదురుచూస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో లక్ష్మి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, మరో మహిళ, ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చేరిన బాలుడు ఆరోగ్యం విషమంగా వున్న ట్టు సమాచారం.  ఇప్పటికైనా పోలీసులు విచారణజరిపి ప్రమాదానికి బాధ్యులను శిక్షించాలని కోరుతున్నారు. దాంతో పాటు ఆర్టీసీ డ్రైవర్లు నిబందనలు పాటించకుండా నిర్లక్ష్యపూరితంగా డ్రైవ్ చేయడం పైనా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola