Revanth Reddy Hath Se Hath Jodo Yatra: గురుకుల పాఠశాల గోడ దూకిన రేవంత్ రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తున్న హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల శివార్లలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వద్దకు ఆయన చేరుకున్నారు. అక్కడ గోడ దూకి మరీ పాఠశాలలోకి ప్రవేశించారు. ఉపాధ్యాయుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పీఆర్సీ అమలు జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.