Plan for Minister Srinivas Goud Murder..! : భారీ కుట్రను ఛేదించిన పోలీసులు | ABP Desam
Continues below advertisement
Telangana Minister Srinivas Goud హత్యకు పెద్ద కుట్రను పోలీసులు ఛేదించి, నివారించారు. శ్రీనివాస్ గౌడ్, ఆయన సోదరుడు శ్రీకాంత్ హత్యకు కుట్ర పన్నినట్టుగా తేల్చారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న నలుగురిని అరెస్ట్ చేశారు. సుపారీ గ్యాంగ్ తో కలిసి మహబూబ్ నగర్ వాసులు కుట్ర పన్నారని పోలీసులు చెబుతున్నారు. ఫరూక్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై ఫరూక్ పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్, రఘును అరెస్ట్ చేశారు. మంత్రి హత్యకు 12 కోట్ల సుపారీ ఇచ్చేందుకు రెడీ అయినట్టుగా సమాచారం అందింది.
Continues below advertisement