Officer Demand Bribe From Farmers: ట్రాన్స్ ఫార్మర్లు రిపేర్ చేయాలంటే లంచం ఇవ్వాల్సిందే.!| ABP Desam
మంచిర్యాల జిల్లా చెన్నూరులో గోదావరి ఉగ్రరూపానికి..... పొలాల్లోని ట్రాన్స్ ఫార్మర్లు నీటమునిగాయి. కోటపల్లి, వేమనపల్లి మండలాలకు చెందిన రైతులు వాటిని బాగు చేయించేందుకు చెన్నూరులో విద్యుత్ శాఖ నిర్వహిస్తున్న SPM షెడ్డుకు వాటిని తీసుకొచ్చారు. అక్కడి సూపర్ వైజర్ వెయ్యి నుంచి 2 వేల రూపాయలు ఇస్తే తప్ప పని చేసేది లేదని తేల్చిచెప్పాడు. రైతులు మరో ఆప్షన్ లేక డబ్బులు సమర్పించుకున్నారు. డబ్బులు ఇస్తుండగా వీడియోలు రికార్డ్ చేశారు.