నిధులన్నీ గజ్వేల్, సిద్దపేట, సిరిసిల్లకేనా? ఎందుకీ వివక్ష? Komatireddy Venkatreddy | DNN | ABP Desam

చౌటుప్పల్ ,గుడిమల్కాపురం రోడ్డును ఆరు నెలల క్రితమే నేను అడిగా, అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని హడావిడిగా రోడ్డు వేస్తున్నారు. ఈ కాంట్రాక్టర్ సీఎం బంధువు. సీఎం ఫామ్ హౌస్ చుట్టూ 600 కోట్లతో 3 నెలల్లో రోడ్లు వేస్తే, ఈ చిన్న రోడ్డు ను వేయడానికి సంవత్సరం పట్టిందని అన్నారు. సిద్దిపేట, సిరిసిల్లలో, అమెరికాలో ఉన్నట్లు రోడ్లు ఉంటాయి కానీ మిగతా నియోజక వర్గాల్లో ఉండవు. సీఎం కేసీఆర్ కు దక్షిణ తెలంగాణపై ఎందుకు అంత వివక్ష. 350 కోట్లతో పిలాయిపల్లి కాలువ ప్రారంభిస్తానని సీఎం కేసీఆర్ చెప్పి అందులో 50 కోట్లు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మింగారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటలో, 20వేల డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తే మునుగోడులో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ స్టార్ క్యాంపేనీయర్ గా బాధ్యతలు అప్పగిస్తే తిరుగుతానని అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola