Mirchi Farmers: తామర పురుగు భయంతో మిర్చి పంటలను దున్నేస్తున్న రైతులు
మిర్చి పంటకు సోకుతున్న తామర పురుగు నుంచి పంటను కాపాడుకునేందుకు వేపరసం ఆయుధంలా పనిచేస్తుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యానవనశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జినుగు మరియన్న తెలిపారు. తామర పురుగు సోకడం, అనేక రకాల సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పటికీ కీటకం నాశనం కాకపోతుండటంతో ఇటీవల కాలంలో రైతులు మిర్చి పంటను దున్నేసి ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తామర పురుగుకు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇటీవల కాలంలో బెంగుళూరుకు చెందిన పరిశోధన బృందం తెలంగాణ, ఆంద్రప్రదేశ్లో పర్యటించింది. వారు చేసిన పలు సూచనలు ఉద్యానవనశాఖాధికారి మరియన్న ఏబీపీ దేశంతో తెలిపారు.