Minister Seethakka Face 2 Face: డిసెంబర్ 28... మంత్రి సీతక్క చెప్తున్న చారిత్రక రోజు ఏంటి..?
ప్రజల సమస్యలు పరిష్కారం చేసే దిశగా రేపటి నుండి ప్రజాపాలనను పూర్తిస్థాయిలో ప్రారంభించనున్నామని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తొలిసారిగా మంత్రి హోదాలో రాగా... ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఐటిడిఎ పిఓ చాహత్ బాజ్ పాయ్ పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఆనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఏబీపీ దేశం ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.